రామజన్మభూమి అయోధ్య కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా బద్రతను కట్టుదిట్టం చేయాలని అదేశించింది. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుచర్యలు చేపట్టాలని అదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టును సాధరంగా స్వాగతించాలని ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు కూడా దేశ ప్రజలను కోరారు.
అయోధ్య తీర్పు నేపథ్యంలో అయోధ్య సహా ఉత్తర్ ప్రదేశ్ లోని పలు కీలక ప్రాంతాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలతో ఇంటర్నెట్ సేవాలను నిలిపివేశారు. 24 గంటల పాటు అంతర్జాల సేవలకు అంతరాయం వుంటుందని అధికారులు ప్రకటించారు. తిరిగి రేపు ఉదయం ఈ సేవలను పునరిద్దరిస్తామన్నారు. మరీ ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో ఎలాంటి అవాంచనీయ పాటు అయో ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా బలగాలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాయి.
తీర్పు నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా వుండేందుకు.. శాంతి సామరస్యం పరఢవిల్లేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో క్రితం రోజున సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అదేశించారు. కాగా, అయోధ్య కేసుపై తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణ నెలకొంది.
ఈ క్రమంలో పలు ముందస్తు చర్యలు తీసుకున్న ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, జమ్మకశ్మీర్ లో అన్ని విద్యాసంస్థలకు ఆయా ప్రభుత్వాలు సెలవులు ప్రకటించారు. దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న ఈ కేసు నేటితో తేలిపోనుంది. దీంతో దేశమంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో దేశంలోని అన్ని దేవాలయాల్లోను భద్రతను కట్టుదిట్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more