ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ప్రాంతంగా బాసిల్లుతున్న విజయవాడ ప్రాంతంలో విచిత్రమైన దొంగతనం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన దొంగతనం కేజీలలో జరిగింది. అంటే కేజీల కొద్ది బంగారమో, వెండి అబరణాలో దొంగలు తస్కరించలేదు. కానీ ప్రస్తతం మాత్రం దాని ధర కాసింత అధికంగా వుండటంతో దొంగలు దీనిని దొంగలించేశారు. అదే ఒకానోక కాలంలో ఇదే వస్తువు కేజీ ఐదు రూపాయల విలువ కూడా చేయదంటే నమ్మశక్యంగా లేదు కదు. అలాంటి వస్తువును ఏ దొంగైనా దొంగలించేనా.? అన్న సందేహాలు కలుగుతున్నాయి కదూ.
నిజమే.. బెజవాడలో దొంగల దొంగలించింది ఉల్లినంటే. విచిత్రంగా వుంది కదూ. ప్రస్తుత మార్కెట్లో ఉల్లిధర ఏకంగా కేజీకి రూ.60 నుంచి 70 వరకు పలుకుతోంది. దీంతో సరిగ్గా పెళ్లిళ్ల సమయం కాబట్టి.. ఉల్లి లేనిదే రుచి వుండదని భావించే వారు తప్పనిసరిగా ఉల్లి కోసం కొంత ఎక్కువ బడ్జెట్ ను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. దీంతో ఆ బడ్జెట్ డబ్బులను మిగిల్చుకునే అలోచన చేసిన ముగ్గురు యువకులు ఓ దుకాణం ముందు వున్న ఉల్లి సంచిని స్నాచింగ్ చేసుకుని వెళ్లారు. అదెలా అంటారా..
ముగ్గురు యువకులు గేర్ రహిత ద్విచక్రవానసంపై వచ్చి ఓ దుకాణం ఎదురుగా అగారు. చూస్తుండగానే ఇద్దరు యువకులు వాహనం దిగారు. ఈ లోగా వాహనచోదకుడు తమ వాహనాన్ని తిప్పిపెట్టాడు. ముందుకుగా దిగిన వ్యక్తి దుకాణంలోకి ప్రవేశించి.. ఏదో వస్తువు కావాలని దుకాణం యజమాని దృష్టిమరల్చాడు. ఈలోపు రెండో వ్యక్తి దుకాణం బయట వున్న ఉల్లి సంచిని లాగి తమ వాహనం ముందర పెట్టాడు. ఇక తాము వచ్చిన పని పూర్తైందన్నట్లు ముగ్గురు కలసి వాహనం ఎక్కి తుర్రుమన్నారు.
అయితే వారి అదృష్టం అలా వుంటూ.. వారి దరదృష్టం కూడా మరో రేంజ్ లో వుంది. దుకాణంలో వున్న నిఘానేత్రం.. సిసిటీవీ ఈ మొత్తం తతంగాన్ని తమ కెమెరాలో బంధించింది. బయటపెట్టిన ఉల్లి సంచి ఎక్కడు పోయిందా.? అంటూ సిసీకెమెరాను పరిశీలించిన దుకాణం యజమాని ఈ దృశ్యాలు చూసి షాక్ అయ్యాడు. కస్టమర్లలా దుకాణంలో వచ్చి తన దృష్టి మరల్చి ఎత్తుకెళ్లారని తెలిసి.. తన వద్దనున్న వీజువల్స్ ను నెట్టింట్లో అప్ లోడ్ చేశాడు. అంతే వెంటనే ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ ముగ్గురు యువకులు ఈ వీడియోను చూసి తాము చేసిన పనికి సిగ్గుపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more