తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం బడాయి కోసం హామీలను గుప్పిస్తుందే తప్ప అవి అచరణ సాధ్యం కావన్న విషయం రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో తేటతెల్లం అయ్యిందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు.. రాష్ట్ర కాంగ్రెస్ ప్రచారకమిటీ చైర్మన్ విజయశాంతి అన్నారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో టిఆర్ఎస్ ప్రభుత్వ తరపు న్యాయవాది చేసిన వాదనను చూస్తుంటే.. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ గారిచ్చే ఏ హామీ కూడా అమలు కాదని స్పష్టంగా అర్థం అవుతోంది విజయశాంతి విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్పై మరోసారి విరుచుకుపడ్డారు రాములమ్మ.
ఆర్టీసీ కార్మికులకు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం వద్ద కనీసం 47 కోట్ల రూపాయల నిధులు కూడా లేవని ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొనడం ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. హైకోర్టు కూడా ఈ వివరణకు కౌంటర్ ప్రశ్న వేస్తూ... ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చడానికి 47 కోట్ల రూపాయలు లేనప్పుడు హుజూర్నగర్లో 100 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి పథకాలు అమలుచేస్తానని కేసీఆర్ గారు ఎలా ప్రకటించారని కోర్టు నిలదీసిందని గుర్తు చేశారు.
కోర్టు వేసిన ప్రశ్నతో కేసీఆర్ అడ్డంగా దొరికిపోయారని విజయశాంతి ఎద్దేవా చేశారు. కోర్టు వేసిన ప్రశ్నకు సమాధానంగా హుజూర్నగర్లో వంద కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద తగిన నిధులు ఉన్నాయని అంగీకరించడం లేదా కేవలం ఉత్తుత్తి హామీలు ఇచ్చానని చేతులెత్తేయడం ఈ రెండిటిలో ఏదో ఒకటి చేయాలని అన్నారు. ఒకవేళ హుజూర్నగర్ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు కేటాయిస్తే అప్పుడు ఆర్టీసీ కార్మికులకు కూడా 47 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు.. తన పంతాన్ని నెగ్గించుకునేందుకు వంద కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఇవ్వకుండా హుజూర్నగర్ ఓటర్లకు కేసీఆర్ మొండిచేయి చూపిస్తారని అర్థమవుతోందని విజయశాంతి అన్నారు. ఇప్పటి వరకు తాను అపర చాణుక్యుడనని కెసిఆర్ ఫీలవుతూ ఉంటారని... అయితే ఇప్పుడు కోర్టు వేసిన గూగ్లితో ఆయన బండారం బయటపడిందని విజయశాంతి విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more