మహారాష్ట్రలో బీజేపీ కూటమి దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఆ కూటమి అధికారం చేపట్టే దిశగా ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపి ఒంటరిగా పోటీ చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న స్థానాల సంఖ్యనే.. తాజాగా సాగిన కూటమిలోనూ అదే పునరావృతం అయ్యింది. అయితే, ఇది కేవలం బీజేపి-శివసేన కూటమికే కాకుండా అటు వారి ప్రత్యర్థి కూటమైన కాంగ్రెస్-ఎన్సీపీలకు సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మహారాష్ట్రంలో గతంలో కన్నా శివసేన మెరుగైన ఫలితాలను సాధించింది.
మొత్తంగా 288 స్థానాలు వున్న మహారాష్ట్ర అసెంబ్లీలో అధికార పగ్గాలు దక్కాలంటే తప్పకుండా 145 స్థానాలను కైవసం చేసుకోవాల్సి వుంది. అయితే బీజేపి శివసేన కూటమి సునాయాసంగా ఈ సంఖ్యను అధిగమించి.. పయనిస్తోంది. బీజేపి 103, శివసేన 61 సీట్లలో ముందంజలో దూసుకుపోతుండగా, కాంగ్రెస్ 41, ఎన్సీపీ 52 సీట్లలో గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. కాగా ఇతరులు 31 స్థానాల్లో తమ అధికత్యను కనబరుస్తున్నారు. రాజ్ థాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ పార్టీ కూడా ఒక అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఇక మహారాష్ట్రలో బీజేపి కూటమి నెత్తిన ఎంఐఎం పార్టీ పాలు పోసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంఐఎం పార్టీ తమకు పట్టున్న ప్రాంతాల్లో అభ్యర్థులను పోటీకి దింపింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిచిన మైనారిటీలు.. తాజా పరిస్థితుల నేపథ్యంలో వారు ఎంఐఎం పార్టీకి చేరువయ్యారు. ఇలా తమ ప్రభావాన్ని పెంచుకునే పనిలో ఎంఐఎం పార్టీ విజయం సాధించగా, కాంగ్రెస్ మాత్రం తమకు మంచి పట్టున్న అసెంబ్లీ స్థానాలను చేజార్చుకుంది. దీంతో కాంగ్రెస్ రెండకెల మార్కు వద్దే నిలిచిపోగా.. బీజేపి మాత్రం శతకం మార్కు దాటి పయనిస్తోంది.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం ఓ సందర్భంలో వెనుకంజలో, మరో సందర్భంలో ముందంజలో కొనసాగుతున్నారు. నాగ్ పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయనతో ఓట్లు దోబూచులాడుతున్నాయి. ఓ రౌండ్లో ఫడ్నవీస్ వెనుకంజ వేయడంతో మహారాష్ట్ర సీఎం అభ్యర్థిగా ఎవర్ని ఎంపిక చేస్తారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఒక వేళ ఫడ్నవీస్ ఓడిపోతే ఎవరు సీఎం పీఠం ఎక్కుతారంటూ అప్పుడే చర్చలు మొదలయ్యాయి. కాగా, వర్లీ నుంచి శివసేన అభ్యర్థి ఆదిత్య థాక్రే ముందంజలో ఉన్నారు. పర్లీ నుంచి పంకజ్ ముండే వెనుకంజలో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more