అనువుగాని చోట అధికులమనరాదు అన్నది పాత పద్యం.. మారుతున్న కాలానికి అనుగూణంగా మార్పులు చేస్తూ ప్రస్తుతం.. అనువుగాని చోట సెల్ఫీలు తీసుకోరాదు అన్నదిగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే సెల్ఫీలో మోజులో ప్రాణాలను కొల్పోతున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతుంది కాబట్టి. అయితే అదెలా అంటే కొందరు కోరి ప్రమాదాల అంచులకు వెళ్లడం కారణమైతే మరికోందరు అనుకోకుండా ప్రమాదాల్లో పడి ప్రాణాలను కొల్పోయి విగతజీవులుగా మారుతున్నారు.
తాజాగా ఈ సెల్ఫీ మోజులో పడిన ఓ యువకుడు తన వారికి దూరంగా వుండిపోయాడు. కొద్దిలో తన ప్రాణాపాయం నుంచి భయటపడిన యువకుడు.. కటకటాల పాలయ్యాడు. స్నేహితులతో కలిసి సరదాగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హంపికి చేరుకున్న అతడ్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి కటకటాల పాలుజేయగా.. అతని స్నేహితులు మాత్రం ఎలాగైనా అతడ్ని బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
విషయం యువకుడి తల్లిదండ్రులతో పాటు కుటుంబసభ్యులు కూడా తెలియడంతో వారు అందోళన చెందుతున్నారు. ఇంతకీ పర్యాటక ప్రాంతంలో సెల్ఫీలు దిగడం నేరమా.? అసలు ఆ యువకుడ్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు.? ప్రాంతం కానీ ప్రాంతంలో పర్యాటకానికి వెళ్లి యువకుడు చిక్కులో ఎలా పడ్డాడు.? పోలీసులు అతడ్ని అదుపులోకి ఎందుకు తీసుకున్నారు.? తమ రాష్ట్రంలోని హంపిలో పోలీసులు రూల్స్ వేరుగా వున్నాయా.? అన్న ప్రశ్నలు వేధిస్తున్నాయా..?
అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన నాగరాజ్ (45) తన మిత్రులతో కలిసి హంపి సందర్శనకు వెళ్లాడు. అక్కడ చారిత్రక కట్టడాలను చూస్తూ ముచ్చటపడ్డాడు. విజయ విఠల ఆలయంలోని సాల మంటపాన్ని చూసి మైమరచిపోయాడు. అక్కడి స్తంభాల వద్ద సెల్ఫీ తీసుకోవాలని ఆరాటపడ్డాడు. ఓ స్తంభానికి ఆనుకుని సెల్ఫీ దిగుతుండగా అది కాస్తా నేలకూలింది. అది తగిలి మరో స్తంభం కూడా కిందపడింది. దీంతో అవాక్కవడం నాగరాజ్ వంతు అయింది.
అయితే, పెద్ద శబ్దంతో స్తంభాలు నేలకూలడంతో అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పురావస్తు శాఖ అధికారుల ఫిర్యాదుతో నాగరాజ్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు స్తంభాలు పడిపోవడానికి కారణం నాగరాజే కారణం కావడంతో మిగతా వారిని వదిలిపెట్టారు.
ఈ సందర్భంగా బళ్లారి ఎస్పీ సీకే బాబా మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్తంభాలు ఉన్న ప్రాంతంలోని నేల వదులుగా మారిందని, నాగరాజ్ స్తంభంపై చేయి వేయగానే అది కిందపడిందని, ఈ క్రమంలో మరో స్తంభానికి తాకి అది కూడా కూలిందని తెలిపారు. అనుకోకుండా జరిగిన ఘటనే అయినప్పటికీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేయక తప్పలేదని ఎస్పీ వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more