Tirumala srivari crown and golden rings missing టీటీడీలో మరో కలకలం.. స్వామివారి కిరీటం..ఉంగరాలు మాయం.!

Tirumala srivari crown and golden rings missing

Tirumala Tirupati devasthanam board, TTD Board, Lord Venkateshwara Swamy ornaments missing, TTD JEO Srinivasa Raju, TTD officials Srinivasa Raju, Srinivasa Raju salary account, Srinivasa Raju srivari ornaments missing, Srinivasa Raju salary recovery, TTD, Sri Venkateshwara swamy ornaments, Crown, Gold rings, JEO Srinivasa Raju, TTD Board, TTD Officials, Crime

Tirumala Tirupati devasthanam board is again in news. This time the TTD board is in the news for missing of Lord Venkateshwara swami (srivaru) ornaments. This incident came to light after TTD officials ordered to recover the loss from JEO Srinivas Raju salary and cornering him for the missing.

టీటీడీలో మరో కలకలం.. స్వామివారి కిరీటం..ఉంగరాలు మాయం.!

Posted: 08/27/2019 11:14 AM IST
Tirumala srivari crown and golden rings missing

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో మరోసారి కలకలం చెలరేగింది. ఆలయ ట్రెజరీలో ఉన్న 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు మాయం కావడమే ఇందుకు కారణమయ్యింది. గతంలో జరిగిన ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్వామివారి అభరణాలు ఎలా మాయం అయ్యాయి..? ఎవరు తస్కరించారు.? అన్న విషయమై ఎలాంటి ఊసులేకుండానే అధికారులు చర్యలు తీసుకున్నారు.

స్వామివారి కిరీటం, బంగారు ఉంగాలు మాయం కావడానికి టీటీడీ ఏఈవో శ్రీనివాసులను బాధ్యుడ్ని చేసిన ఆలయ ఉన్నాతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆభరణాల విలువను ఆయన నెలసరి వేతనం నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. ఎన్నో ఏళ్లుగా స్వామివారి చెంత ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందిస్తున్న జేఈవో శ్రీనివాసులుపై ఉన్నతాధికారులు ఏకపక్షంగా చర్యలు తీసుకోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్వామివారి ఆభరణాల మాయం ఘటనకు ఆయను బాద్యుడ్ని చేసి ఏకపక్షంగా చర్యలు తీసుకుంటారా.? అంటూ కొందరు నిరసన తెలుపుతున్నారు. కాగా ఇలాంటి తప్పులు చేసిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం రికవరీ మాత్రమే చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

స్వామి వారికి నిత్యం అలంకరించే 290 ఆభరణాల్ని మినహాయిస్తే... మిగిలిన నగలన్నింటిని టీటీడీ ట్రెజరీలో భద్రపరుస్తుంది. అయితే ట్రెజరీలో 2012లో కూడా ఓ దొంగతనం జరిగింది. అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి ట్రెజరీలో ఉన్న అమెరికన్ డైమండ్స్‌ను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. సీసీ కెమెరాలకు అడ్డంగా దొరకడంతో అప్పట్లో ఈవార్త టీటీడీలో సంచలనం సృష్టించింది, ఆ తర్వాత ట్రెజరీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. అయితే పూర్తిస్థాయి భద్రత పెంచామన్నప్పటికీ మరోసారి శ్రీవారి నగలు మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. దీనికి బాద్యత వహిస్తూ అక్కడు పనిచేసే టీటీడీ ఏఈవో శ్రీనివాసులు జీతం నుంచి ప్రతీ నెల రూ. 30వేల రికవరీ చేస్తున్నారు. అయితే ఇప్పటిరవరకు అతనిజీతం నుంచి దాదాపు ఏడున్నర లక్షల వరకు రాబట్టినట్లు సమాచారం.

తాజాగా శ్రీవారి ఆలయంలో జరిగిన ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీటీడీ నిర్లక్ష్యంపై చర్యలకు సిద్ధమవుతున్నాయి. అవసరమైతే ఉన్నతాధికారులతో పాటు.. సీఎంకు అవసరమైతే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామని చెబుతున్నాయి.టీటీడీ ఆర్థిక శాఖ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగిందని ఆరోపిస్తున్నారు.
మరోవైపు శ్రీనివాసులుపై ఏకపక్షంగా చర్యలు తీసుకోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు కారకులు ఎవరే విషయాన్ని నిర్ధారించుకోకుండానే శ్రీనివాసులు నుంచి రికవరీ చేయడాన్ని తప్పుబడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles