ఉత్తమ కానిస్టేబుల్ గా అమాత్యుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆమ్యామ్యాలకు మాత్రం చేయి చాచడం ఆగలేదు. స్వతహాగా వున్న అలవాటు అంత తొందరగా వదులుకోలేని కానిస్టేబుల్.. కనీసం అవార్డును పొందిన తరుణంలోనైనా కొన్ని రోజుల పాటు మానుకుని వుంటే బాగుండేది. అయితే ఉత్తమ కానిస్టేబుల్ పురస్కారం అందుకున్న నేపథ్యంలో తనకు ఎదురేమిటని భావించాడో ఏమో.. బాధితుడి నుంచి అమ్యామ్యాలను తీసుకుంటు 24 గంటలు కూడా తిరక్కుండానే ఏసీబీ చేతికి చిక్కాడు.
తెలంగాణలో మహబూబ్ నగర్ లో జరిగిన ఈ ఘటన ప్రభుత్వం అందించే పురస్కారాలను కూడా చర్చనీయాంశంగా మార్చేసింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మహబూడ్ నగర్ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న తిరుపతి రెడ్డి ఉత్తమ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున మంత్రి శ్రీనివాస్గౌడ్ చేతుల మీదుగా తిరుపతిరెడ్డి పురస్కారం అందుకున్నాడు.
గురువారం అందుకున్న పురస్కారాన్ని పక్కన పడేసిన కానిస్టేబుల్ శుక్రవారమే లంచాల దందాకు తెరతీశాడు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన ముడావత్ రమేశ్ అనే ఇసుక వ్యాపారిని అడ్డుకుని అతడి ఇసుక ట్రాక్టర్ను సీజ్ చేశాడు. రూ.17 వేలు ఇస్తేనే ట్రాక్టర్ ను విడిచిపెడతానని తేల్చి చెప్పాడు. దీంతో బాధితుడు ముడావత్ రమేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయం చెప్పాడు. నిబంధనలకు అనుగుణంగానే ఇసుకను తరలిస్తున్నప్పటికీ కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి తనను అడ్డుకుని లంచం డిమాండ్ చేస్తున్నాడని పిర్యాదు చేశాడు.
తనకు డబ్బులు ఇవ్వకుంటే తప్పుడు కేసులు బనాయిస్తానని హెచ్చరించాడంటూ రమేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు అతడికి రూ.17 వేలు ఇచ్చి కానిస్టుబుల్కు ఇవ్వమని చెప్పారు. వారు చెప్పినట్టే పోలీస్ స్టేషన్ ఆవరణలో కానిస్టేబుల్ను కలిసి అడిగిన మొత్తం ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన ఏసీబీ అధికారులు తిరుపతిరెడ్డిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడి నుంచి నగదు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more