ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి నిర్ధేశించిన ముహూర్తం ప్రకారం ఈ నెల 30వ తేదీన వైఎస్ జగన్, విజయవాడలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేస్తున్నారు. ప్రజలు పెద్దసంఖ్యలో వస్తారని, ఈ నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పార్టీ వర్గాలు పోలీసులను కోరాయని సమాచారం.
ఈ కార్యక్రమానికి పోరుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు కూడా హాజరయ్యే అవకాశముందని సమాచారం. దీంతో వీవీఐపీల కారు పార్కింగ్ లకు, ట్రాఫిక్ జామ్ కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారని విశ్వసనీయ సమాచారం. విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఇప్పటికే జగన్ నుంచి కేసీఆర్ కు ఆహ్వానం అందినట్టు సమాచారం. దీనికి కేసీఆర్ సైతం సానుకూలంగా స్పందిస్తూ, తాను తప్పకుండా వస్తానని చెప్పినట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం అధికారులను కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది.
మూడవ అతిపిన్న వయస్సు ముఖ్యమంత్రి
కాగా, అతిపిన్న వయసులో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయనున్న మూడో వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ప్రస్తుతం జగన్ వయసు 46 సంవత్సరాల 6 నెలలు కాగా, ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు 38 సంవత్సరాల 11 నెలల వయసులో దామోదరం సంజీవయ్య సీఎంగా పనిచేశారు. ఆ తరువాత 45 సంవత్సరాలా 5 నెలల వయసులో చంద్రబాబునాయుడు సీఎం అయ్యారు. వీరిద్దరి తరువాత తక్కువ వయసులో సీఎం కానున్నది జగనే. ఇక దేశవ్యాప్తంగా పరిశీలిస్తే, అసోంకు 1985లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రఫుల్ల కుమార్ మహంత వయసు 33 ఏళ్లు మాత్రమే. ఆ తరువాత 2012లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి అఖిలేష్ యాదవ్ వయసు 39 సంవత్సరాలే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more