మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అవినీతిలో నెంబర్ వన్ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పక్షాల నుంచి విమర్శలను ఎదుర్కోంటున్నారు. తమ నిజాయితీ నిరూపించుకోలేని దివంగత నేతలపై కావాలనే ప్రధాని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఉపాధ్యాయులు ఈ విషయంలో ఇప్పటికే రెండు బృందాలుగా విడిపోయి చెరో ప్రకటన విడుదల చేశారు.
అయితే రాజీవ్ గాంధీని సమర్థించిన ఓ గ్రూపులో మొత్తం 207 మంది ఉపాధ్యాయులు రాజీవ్ తీసుకువచ్చని గణనీయమార్పులను వారు ఊటంకిస్తూ.. చివరకు కార్గిల్ యుద్దం ముగిసిన తరుణంలో దేశసైన్యం రాజీవ్ గాంధీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారని, అందుకు కారణం రాజీవ్ గాంధీ హాయంలో తీసుకువచ్చిన బోఫోర్స్ తుపాకులేనని, వాటితోనే యుద్దం చేశారని వారు గుర్తు చేశారు. ఇక వ్యతిరేకించిన గ్రూపులోని 125 మంది మాత్రమే ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు.
ఇదిలావుంటూ రాజీవ్ గాంధీ అవినీతిపరుడన్న వ్యాఖ్యలను తాజాగా సొంత పార్టీ నేత కూడా ఖండిస్తున్నారు. రాజీవ్గాంధీ గురించి మోదీ మాట్లాడటం అనవసరమని కర్ణాటక బీజేపి నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఉగ్రవాదులు కుట్ర పన్ని హత్య చేశారు. అవినీతి ఆరోపణలతో ఆయన చనిపోలేదు. అలా చనిపోయారంటే తానే కాదు ఎవరూ నమ్మరు. ప్రధాని మోదీ అంటే నాకు చాలా గౌరవం. కానీ రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా అలాంటి వ్యాఖ్యలు చేయడం అనవసరమని అన్నారు.
రాజీవ్గాంధీ చిన్న వయసులోనే ప్రధానిగా పెద్ద బాధ్యతలు చేపట్టారని ఆయన అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయీ లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఆయన గురించి గొప్పగా మాట్లాడారు’ అని శ్రీనివాస ప్రసాద్ అన్నారు. అయితే అలాంటి మాజీ ప్రధానిపై.. ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సముచితమని ప్రశ్నించిన ఆయన అసలు రాజీవ్ గాంధీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారసభలో మోదీ.. మాజీ ప్రధాని రాజీవ్గాంధీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more