రైట్ టు ఇన్ఫార్మేషన్ యాక్ట్ పరిధిలోకి తెలంగాణ ఇంటర్ బోర్డు వచ్చిన్నా.. ఆ చట్టం కింద విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు జవాబు పత్రాలకు ఇవ్వడం కుదరదని తాజాగా ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. అయితే ఇంటర్మీడియట్ బోర్డుకు నిర్దేశిత ఫీజు చెల్లించి మాత్రమే సదరు విద్యార్థులు వారి అన్సర్ షీట్ తీసుకునే అవకాశం ఉందని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసిన మార్కుల జాబితాలో అవకతవకలు ఏర్పడి ఇప్పటికే 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో సామాజిక మాధ్యమంలో స్పందించిన పలువురు సమాచార హక్కు చట్టం కింద ఈ పత్రాలను తీసుకోవాలని పోస్టును పెట్టింది.
విద్యార్థులు అందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇక రీ వెరిఫికేషన్, రీ వాల్యూయేషన్ కోసం విద్యార్థులు అనవసరంగా డబ్బులు వెచ్చిండం కన్నా.. సమాచార హక్కు చట్టం కింది వారి జవాబు పత్రాలను పొందవచ్చని దీనికి కేవలం అత్యల్ప రుసుము మాత్రమే ఖర్చు అవుతుందని,, వాటిని సరిచూసుకున్న తరువాత అప్పుడు రీ వాల్యుయేషన్ కు వెళ్లవచ్చిని ఫోస్టులు విపరీతంగా వైరల్ అయ్యారు. సామాజిక మాధ్యమాలు, కొన్ని పత్రికల్లో వార్తలు రావడంపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ దించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2005 అక్టోబరు 13న జారీ చేసిన 454 జీవో ప్రకారం మూల్యాంకనం చేసిన ఇంటర్ జవాబు పత్రాలు ఫీజు చెల్లించి తీసుకునే సామగ్రి కిందకు వస్తాయని తెలిపారు. అందువల్ల సంబంధిత విద్యార్థులు మాత్రమే బోర్డు నిర్దేశించిన ఫీజు చెల్లించి జవాబు పత్రాలు పొందే అవకాశం ఉందని, ఇతరులకు లేదన్నారు. అలాగే ఇంటర్లో తప్పిన విద్యార్థుల జవాబు పత్రాలను ఉచితంగా రీవాల్యుయేషన్ చేస్తామని, అందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరం లేదని ఇంటర్ బోర్డు తెలిపింది. ఇప్పటికే ఫీజు చెల్లించి దరఖాస్తు చేస్తే ఆ ఫీజు వాపసు చేస్తామన్నారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు మాత్రం ఆయా కళాశాలల్లో చెల్లించాలని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more