రాజకీయాల్లోకి రావాలంటే.. ఎలాంటి అర్హతలు లేకున్నా సరే, డబ్బులుంటే చాలనే దౌర్భాగ్య పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఏర్పడిందని జనసేనాని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాష్ట్రం సుస్థిరంగా వుండాలని కోరుకునే వ్యక్తిగా, ప్రజలకు ఎలాంటి కష్టనష్టాలకు గురికావద్దని 2014లో ఏమీ ఆశించకుండానే టీడీపీ, బీజేపీకి అండగా ఉన్నానని పవన్ తెలిపారు. 2014లో జనసేన పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఆ సభలో తాను ఏదైనా తప్పు మాట్లాడితే దాడి చేద్దామని కూడా పలువురు కాచుకున్నారని పవన్ చెప్పారు.
రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ 5వ ఆవిర్భావ సభలో లక్షలాదిగా హాజరైన అభిమానులు, జనసైనికుల సాక్షిగా ప్రసంగించిన పవన్ కళ్యాణ్.. తన వద్ద లేవ కోట్ల రూపాయలు లేవని.. టీవీ ఛానళ్లు, పేపర్లు లేవని అన్నారు. తాను ముఖ్యమంత్రి కొడుకును అంతకన్నా కాదన్నారు. అయితే ఇవి లేకపోతే రాజకీయాల్లోకి రాకూడదా..? అని ప్రశ్నించారు. తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, కోట్ల రూపాయలు వచ్చే భవిష్యత్తును వదులుకుని ప్రజల కోసం నడుద్దమాని మార్పు కావాలని వచ్చానన్నారు.
పాతికేళ్ల భవిష్యత్తును వదిలేసి.. తనకు అండగా నిలిచిన యువత కోసం.. రాష్ట్ర ప్రజల కోసం వారి పాతికేళ్ల బంగారు భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తాను జనసేన పార్టీని స్థాపించిన 2014లో ఒక్కటే నమ్మాను. సమాజం మారాలి, వ్యవస్థ మారాలి, మార్పు రావాలి. తనలాగే మార్పు కోరుకున్న వారికి నా మాటలు అర్థం అవుతాయని నమ్మానని పవన్ అన్నారు. తాను ‘సత్యమేవ జయతే’ నినాదాన్ని నమ్ముకున్నానని తెలిపారు. మార్పు తాను మాత్రమే కోరుకుంటే రాదని పవన్ అన్నారు.
ఈ సందర్బంగా తన చిన్నతనంలో తన సోదరుడు నాగబాబు చెప్పిన మాటను ఊటంకించ్చారు. మార్పు రావడానికి.. సమాజంలో గర్భధారణ పరిస్థితులుంటే, నాయకుడొచ్చి మంత్రసాని పని చేస్తాడని లెనిన్ చెప్పారట. మీరు మార్పు రావాలని కోరుకుంటున్నారు. నేనేదో గొప్ప పని చేస్తున్నానని భావించట్లేదు. కాలానుగుణంగా మార్పులొస్తాయని పవన్ అన్నారు. అడుగు వేస్తే తల తెగిపోవాలే కానీ, మడమ తిప్పనని ఆయన స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more