కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి పథంలో నడిపించే బడ్జెట్ ఇది అని, దేశాన్ని బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ ముందడుగు అని అన్నారు. అన్ని వర్గాల్లో సంతృప్తినిచ్చిన, వ్యవసాయ రంగంతో పాటు రైతులను పరిపుష్టం చేసే బడ్జెట్ ఇది అని చెప్పారు. ఆదాయ పన్ను రూ.5 లక్షలకు పెంచాలన్నది ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రజల కోరికని తెలిపారు.
వేతన జీవుల, మధ్యతరగతి ప్రజల కోరికను తమ ప్రభుత్వం నెరవేర్చబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. ‘ఆయుష్మాన్ భారత్’ ద్వారా 50 కోట్ల మందికి, ‘స్వచ్ఛభారత్’ ద్వారా 9 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరిందని అన్నారు. ఈ బడ్జెట్ 12 కోట్ల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చిందని, మూడు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఈ ఇంటరీమ్ బడ్జెట్ కేవలం ట్రైయిలర్ మాత్రమేనని అయితే ఎన్నికల తరువాత మరిన్నీ సంక్షేమ పథకాలు అమలు అవుతాయన్న ప్రధాని చెప్పుకోచ్చారు.
దేశంలోని ప్రతి వర్గానికి మేలు కలగాలన్నదే తమ ఆశయమని కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, దేశ సమగ్ర వికాసమే ప్రధాని మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఏటా రూ.6 వేల చొప్పున చెల్లించాలన్న నిర్ణయం చారిత్రాత్మకమైందని, ఈ ఆర్థిక సాయం చిన్న రైతులకు గొప్ప ఊరట అని అన్నారు.
రైతుల కోసం తాము తీసుకున్న నిర్ణయం ఇంత వరకూ ఎవరూ తీసుకోలేదని, ఈ పథకం ద్వారా 12.5 కోట్ల మంది రైతులకు మేలు కలుగుతుందని అన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2018 డిసెంబర్ నుంచే అమలు చేయాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్ అందించే పథకం కూడా చాలా గొప్పదని, దీని ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం కలుగుతుందని పీయూష్ గోయల్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more