కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు దేశంలోని ప్రతీ ఇంటిలో విద్యుత్ కాంతులను వెదజల్లేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తుందని అర్థిక మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జట్ ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్న ఆయన.. మార్చి వరకు దేశంలోని అన్ని ఇల్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. 22 రకాల పంటలకు మద్దతు ధర పెంచామని అన్నారు. ప్రధాన మంత్రి సడక్ యోజనా పథకం కింద దేశంలో వేగంగా రహదారుల నిర్మాణం చేపడుతున్నామన్నారు.
ఇందుకోసం రూ.19 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇప్పటివరకూ రూ.3వేల కోట్ల పేదల ధనం ఆదా అయిందని చెప్పిన గోయల్.. దీంతో గ్రామీణ పట్టణ ప్రాంతల మధ్య అంతరం తొలగిపోయేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2014కు ముందు బస్సు సౌకర్యం లేని అన్ని గ్రామాలకు ఆ సౌకర్యం కల్పించాం. గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామీణ సడక్ యోజనలో భాగంగా మూడింతల రహదారుల నిర్మాణం పెరిగిందని అన్నారు.
గ్రామీణ భారతంలో జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పట్టణ ప్రాంతాలకు ధీటుగా గ్రామీణ ప్రజలకు కూడా అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి రూ.60వేల కోట్లు ఖర్చు చేశాం. అంతేకాదు దేశంలోని ప్రజలకు అయుష్మాన్ భారత్ పథకంలో కార్పోరేట్ వైద్యాన్ని అమల్లోకి తీసుకువచ్చామని అన్నారు. దీని ద్వారా దేశంలో 50 కోట్ల మందికి లబ్ది చేకూరనుందని తెలిపారు.
తమ ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వమన్నారు. రేరా చట్టం ద్వారా బినామీ లావాదేవీలను నిరోధించగలిగినది తమ ప్రభుత్వమేనన్నారు. మా ప్రభుత్వ పాలన దేశంలో ప్రతి ఒక్కరి ఆత్మ విశ్వాసాన్ని పెంచిందని తెలిపారు. నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని నిజాయతీగా అమలు చేస్తోందని తెలిపారు. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను దేశానికి తిరిగి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
దేశంలో అర్థికంగా వెనకుబడిన వర్గాలకు న్యాయం చేసే దిశగా పది శాతం రిజర్వేషన్ అమల్లోకి తీసుకువచ్చింది తామేనన్నారు. ఇక దేశంలో అధికంగా వున్న ప్రజలు ఆరాద్యంగా కొలిచే గోవుల రక్షణకు కూడా కమీషన్ వేస్తున్నామని చెప్పారు పియూష్ గోయల్. గో రక్షణకు రూ.750 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రీయ గోకుల్ యోజన పథకం కింది గో రక్షణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఇదే విధంగా మత్స్యశాఖకు కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ భారతంలో 98శాతం మరుగుదొడ్లు నిర్మించిన ఘటన కూడా కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more