హైదరాబాద్ నగర ప్రయాణికులకు గతేడాది శుభవార్తను అందించింది ప్రభుత్వం. నగరంలో ప్రజారవాణా వ్యవస్థలైన మెట్రో, ఆర్టీసీ బస్సు, ఎంఎంటీఎస్ రైళ్లల్లో ప్రయాణించే వారికి ఈ విషయాన్ని చెప్పిన ప్రభుత్వం వారికి ఈ మూడు రవాణా వ్యవస్థలో ప్రయాణించేందుకు వీలుగా కామన్ మొబిలిటీ కార్డులు తీసుకువస్తామని చెప్పింది. అయితే మెట్రో రైలు పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో కాసింత ఆలస్యం జరిగింది. త్వరలో మూడు మెట్రో మార్గం కూడా అందుబాటులోకి రాబోతున్న తరుణంలో తామిచ్చిన మాటకు కట్టుబడిన ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది.
ఆర్టీసీ, మెట్రోతో పాటు ఎంఎంటీఎస్ ను కూడా అనుసంధానిస్తూ ఈ కార్డును రూపొందిస్తుంది. కామన్ మొబిలిటీ కార్గులు వచ్చే నెలాఖరు వరకూ డెడ్ లైన్ పెట్టింది ప్రభుత్వం. దీంతో నగరవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కామన్ మొబిలిటీ కార్డులపై మరోసారి కదలిక వచ్చింది. నగరంలో మెట్రో రైలు సర్వీసులు రెండు ప్రాంతాల నుంచి విజయవంతంగా నడుస్తున్నాయి. రోజుకి రెండు లక్షలమంది జనం మెట్రోలో ప్రయాణిస్తున్నారు.
వచ్చే నెలలో హైటెక్ సిటీ రూట్ లో కూడా మెట్రో రైలు పట్టాలకెక్కితే… ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముంది. దీంతో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ళను లింక్ చేస్తూ… పాస్ లు ఇష్యూ చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. మెట్రో రైల్లో టిక్కెట్లకి, బస్ పాస్ లకు వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. దాంతో కామన్ పాస్ ఉంటే… ఖర్చులు తగ్గుతాయనీ… కామన్ మొబిలిటీ కార్డు కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో బేగంపేట హెచ్ఎంఆర్ఎల్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ జరిగింది. మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ లకు కలిపి కామన్ మొబిలిటీ కార్డు ప్రవేశపెట్టడంపై ఈ సమావేశంలో చర్చించారు. ఎస్బీఐ, హిటాచీ కన్సార్టియంతో కామన్ మొబిలిటీ కార్డు ను ప్రవేశపెట్టడంపై ఎల్ అండ్ టి మెట్రో సీఈఓ అనిల్ శైనీ వివరించారు. ఈ కార్డుల జారీ కోసం ఎస్బీఐతో సంప్రదింపులు జరపాలని ఈర్టీసీ ఈడీకి ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more