బీహార్ ప్రభుత్వ అమానవీయంగా, నిసిగ్గుగా వ్యవహరిస్తుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రింకోర్టు ఇవాళ మెట్టికాయలు వేసింది. ప్రభుత్వ వసతి గృహాల్లో చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో నితీష్ కుమార్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని తీవ్రంగా అక్షింతలు దట్టించింది. ఈ కేసుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు దురదృష్టకరం అని సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. చిన్నారులు దేశ పౌరులు కాదు అన్నట్లుగా బీహార్ ప్రభుత్వం తీరు వుందని అక్షేపించింది.
‘ఈ కేసుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వైఖరి చాలా దురదృష్టకరం, విచారకరం. ఓ చిన్నారి లైంగిక వేధింపులకు గురైతే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. మీరు కనీసం ఎఫ్ఐఆర్ను కూడా సరిగా నమోదు చేయలేకపోయారు. రాష్ట్రంలోని 17 వసతి గృహాలపై ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. ఎందుకు ప్రతి కేసును దర్యాప్తు చేయట్లేదు. ఈ చిన్నారులు పౌరుల కంటే తక్కువా?’ అని సుప్రీంకోర్టు బిహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
చిన్నారులపై లైంగిక దాడుల కేసులను అత్యంత శ్రద్ధ పెట్టి దర్యాప్తు చేయాలని అత్యున్నత న్యాయస్థానం అదేశించినా.. ప్రభుత్వానికి మాత్రం దీనిపై అసలు శ్రద్ద లేదని, అక్షేపించింది. ఇదేనా మీ శ్రద్ధ..? ఈ కేసును చూసిన ప్రతిసారి చాలా బాధగా ఉంటోంది’ అని న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసుల వ్యవహారంలో ఇకపై ఎఫ్ఐఆర్ సరిగా నమోదు చేయకపోయినట్లయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేస్తామని న్యాయస్థానం హెచ్చరించింది.
బిహార్లోని ఓ వసతి గృహంలో 34 మంది బాలికలపై లైంగిక దాడులు జరిగిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముంబయికి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ చేపట్టిన అధ్యయనంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలోని పలు వసతి గృహాలపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. బాలుర వసతి గృహాల్లోనూ చిన్నారులు భౌతిక హింసకు గురవుతున్నట్లు తేలింది. అయితే ఈ కేసుల పట్ల నితీశ్ కుమార్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more