దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మన బాలీవుడ్ హీరోలకు, నటీమణులకు చాలా ఆదరణ వుందన్న విషయం అతిశయోక్తి కాదు. మన బాలీవుడ్ తారలను కలిసేందుకు ఏకంగా వేల కోట్ల రూపాయలను వెచ్చించి ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే వారికున్న అదరణను అర్థం చేసుకోవచ్చు. ఇక రాజులు, రాజ్యాలు వున్న దేశాల్లో ఈ కార్యక్రమాన్ని స్వయంగా యువరాజుల ఆధ్వర్యంలోనే జరుగుతుందంటే.. వారి సెలబ్రిటీ స్టేటస్ కు ఇది అద్దం పడుతోంది.
అలాంటి సెలబ్రిటీతో కలవాలని, వారితో కుదిరితే రెండు మాటలు మాట్లాడాలని, ఇంకా అవకాశం కల్పిస్తే ఓ సినిమాలో నటించాలని ఏ అభిమాని మాత్రం కోరుకోడు. అయితే ఇలాంటి ప్రయత్నాలే చేసిన ఓ హీరో అభిమానం పరాకాష్టకు చేరి.. తన అభిమాన హీరోకే చంపేస్తానంటూ బెదిరింపులు పంపించాడు. ఔనా ఎందుకిలా చేశాడంటే.. తన అభిమాన హీరోను కలుసుకోవాలన్న తన అశ తీరక.. ఆయన కలసి నటించాలన్న అవకాశం లభించక ఇలా అభిమాని ఉన్మాదిగా మారాడు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన యూపీకి చెందిన ఒక వ్యక్తి ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు. ముంబై పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సల్మాన్ ఖాన్ అభిమాని.. హీరో పర్సనల్ మేనేజర్ ఫోన్ నెంబర్ ను సంపాదించాడు. అతనికి ఫోన్ చేసి, సల్మాన్ ఫోను నెంబరు కావాలని అడిగాడు. దీనికి అతను నిరాకరించాడు.
దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తి తిట్ల దండకం అందుకుంటూ, సల్మాన్ను చంపేస్తానని బెదిరించాడు. ఇంతటితో ఆగక అతను సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ కు కూడా ఫోన్ చేసి సల్మాన్ ఫోన్ నంబరు అడిగాడు. తాను గ్యాంగ్ స్టర్ ఛోటా షకీల్ దగ్గర పనిచేస్తుంటానని తెలిపాడు. సల్మాన్ తండ్రి కూడా ఫోన్ నంబర్ ఇవ్వకపోవడంతో అతనిని కూడా బెదిరించాడు. కాగా సల్మాన్ తరపున అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యూపీకి చెందిన గులాబన్బీ ఉరఫ్ షేర్ను నిందితునిగా గుర్తించి అరెస్టు చేశారు.
(And get your daily news straight to your inbox)
May 20 | రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. పాత జన్యురూపాన్ని మార్చుకొని వచ్చిన కొత్త రకం (బీఏ4) వైరస్కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతం ఈ... Read more
May 20 | ఓ వైపు వేదమంత్రోచ్ఛరణలు.. మాంగళ్యం తంతునానీనాం.. అంటూ.. వధూవరులను భార్యభర్తలుగా మార్చే పవిత్రమైన మంత్రాన్ని అందుకున్నారు అయ్యవారు. ఇంతలో ఆగండీ అన్న శబ్దం వినిపించింది. కళ్యాణమండపం ప్రధాన ద్వారం వరకు పెళ్లి వేదిక సహా..... Read more
May 20 | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు... Read more
May 20 | రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పరిమితి సంఖ్యలో పోటీ చేయబోతోందని అభిమానులకు నూతనోత్తేజం కలిగించేలా... Read more
May 20 | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పేరు తెలియని వారు ఉండరు. వరుస వివాదాలతో ఆయన ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. దాణా కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలై... Read more