ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కన్నేసిన బీజేపి.. ఎలాగైనా తాము తమ లోపాయికారి మిత్రపక్షాలతో అధికారంలోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో పక్షం రోజుల్లో టీడీపీలోని క్రియాశీలక నేతలను టార్గెట్ చేసుకుని అదాయ, ఈడీ అధికారులతో దాడులు చేయించి.. టీడీపీ పార్టీ నేతల్లో అల్లకల్లోలం సృష్టించేందుకు రంగం సిద్దం చేసిందని.. దాని పేరే అపరేషన్ బి అని సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత... ఆ పార్టీ ఏపీపై మరింత తీవ్ర స్థాయిలో దాడికి తెగబడబోతోందనే వార్తలు తన వరకు వచ్చాయని ఆయన తెలిపారు. రానున్నపక్షం రోజుల్లో టీడీపీ సానుభూతిపరులైన ప్రముఖులు, తెలంగాణ, ఏపీలో టీడీపీకి అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, ఈ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఈడీ, ఐటీ దాడులు జరగబోతున్నట్టు తన వద్ద సమాచారం ఉందని చెప్పారు. ప్రధాని కార్యాలయంలో ఉన్న ఒక కీలక అధికారి ఈ దాడులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
అయితే ఎవరెవర్ని ఐటీ, ఈడీ సంస్థలు టార్గెట్ చేశాయన్న జాబితాను కూడా ఆయన చెప్పారు. వారి పేర్లను ప్రస్తావించకుండా చూచాయగా వారికి సమాచారాన్ని అందించారు. విజయవాడలో ఉన్న ఇద్దరు హోటల్ యజమానులు, విజయవాడ దగ్గరలో ఉన్న పెద్ద యూనివర్శిటీ యజమాని దాడులను ఎదుర్కోబోయే జాబితాలో ఉన్నారని తమ్మారెడ్డి తెలిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఉన్న టాప్ టీడీపీ నేతలు, బయో ఫర్టిలైజర్స్ బిజినెస్ లో ఉన్న ఓ నేత, మైనింగ్ లో ఉన్న ఒక నేత, రియలెస్టేట్ లో ఉన్న మరో నేతలను ఈ సంస్థలు టార్గెట్ చేయనున్నాయన్నారు.
తనకు అందిన సమాచారంలో కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు నేతలతో పాటు అదే జిల్లాలో ఇసుక వ్యాపారంలో ఉన్న ఇద్దరు నేతలు... ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు... ఉత్తరాంధ్ర, నెల్లూరు జిల్లాలకు చెందిన మరో ఇద్దరు మంత్రులు, గుంటూరు జిల్లాకు చెందిన ఒక సంపన్న ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మరో నేత, పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక బిజినెస్ తో సంబంధం ఉన్న ఒక ఎమ్మెల్యే, ఒక సంపన్న ఎంపీపై దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పారు.
సీఎం రమేష్ పై ఇప్పటికే దాడులు జరిగిన నేపథ్యంలో ఆయనను ఏదో ఒకటి చేసిన దెబ్బతీయాలని బీజేపి భావిస్తుందని తెలిపారు. దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీ నేతలలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వీరంతా టీడీపీకి మద్దతు ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితులను తీసుకొస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే ఫార్ములాను ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో వాడుతున్నారని ఆయన తెలిపారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని దారుణాలు జరిగినా కళ్లుమూసుకునేు కేంద్రం.. ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కుట్రలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. కేరళ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే శబరిమల అంశాన్ని బీజేపీ వివాదాస్పదం చేస్తోందని అన్నారు. తనకు తెలిసిన విషయాన్నే తాను చెప్పానని అన్నారు. ఆపరేషన్ గరుడ విషయంలో హీరో శివాజీని లోపల వేసి, విచారణ జరిపించాలని డిమాండ్ చేసే బీజేపీ, వైసీపీ నేతలు.. తాజాగా తనపై కూడా ఇలాంటి డిమాండ్లను తెరపైకి తీసుకురావచచని అన్నారు. ఇందులో భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం వల్లే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిందని... అందువల్లే టీడీపీని ఇబ్బందులపాలు చేసే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోందని తమ్మారెడ్డి విమర్శించారు. టీడీపీకి చెందిన నేతలను దొంగలుగా చూపించడం వల్ల... జనాల్లో టీడీపీని చులకన చేయాలనేది బీజేపీ ఆలోచన అని చెప్పారు. 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను దొంగలుగా చూపెడితే... ఓటర్లలో దాని ప్రభావం ఎంత స్థాయిలో ఉంటుందో ఊహించగలమని అన్నారు. అయితే, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న ఆయన గతంలో తాను చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడానని గుర్తుచేశారు.
కేంద్రం నియంతృత్వ విధానాలను అవలంభిస్తుందని.. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని.. అందువల్లే తనకు వరకు చేరిన విషయాలను బహిరంగ పర్చానని తమ్మారెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు దొంగలైనప్పుడు ఎన్డీయేతో టీడీపీ కలిసున్నప్పుడే దాడులు చేసి ఉండవచ్చని... విడిపోయిన తర్వాతే ఎందుకు చేయాలని ప్రశ్నించారు. ఇదంతా అవకాశవాదమే అని చెప్పారు. దక్షిణాదిలో పాతుకుపోవడం అంత ఈజీ కాదనే విషయం కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీకి తెలిసిపోయిందని... అందుకే 'ఆపరేషన్ బి'ని ప్రారంభించారని అన్నారు. కాంగ్రెస్ ను ఇంత వరకు విమర్శించామని... కానీ, బీజేపీ ఇంకా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశంలోని కీలక వ్యవస్థలను కూడా తమ లబ్ధి కోసం నాశనం చేస్తున్నారని తమ్మారెడ్డి దుయ్యబట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more