అనువుగాని చోట అధికులమనరాదు.. కొంచమై వుండుటెల్ల కొదవకాదు.. కొండ అద్దమందు కొంచమై వుండదా.. అని కవి వేమన తన కవితలలో ఎంతో చక్కగా చెప్పి బావితారాలకు అందించినా వాటిని వంటపట్టించుకుని అచరిద్దామని ఈ రోజుల్లోని ఎవరూ అలోచించడం లేదు. అధికారంలో వుంటే అంతా మనదే.. ఎమైనా చేయవచ్చు.. ఎలాగైనా ప్రవర్తించవచ్చునని భావిస్తున్నారు నేతలు. మరీ ముఖ్యంగా అటు కేంద్ర, రాష్ట్రాల్లో ఇటు స్థానికంగా కూడా తమే అధికారంలో వున్నామని బీజేపి నేతలు శృతిమించి వ్యవహరిస్తున్నారు.
దేశరాజధాని ఢిల్లీ-డెహ్రాడూన్ రహదారిపై వున్న తన రెస్టారెంటులో బోజనానికి వచ్చిన సబ్ ఇన్స్ పెక్టర్ సుఖ్ పాల్ సింగ్ పాన్ వర్ పై దాడి చేసి చితకబాదడమే కాకుండా.. మహిళా న్యాయవాదితో అనుచితంగా వ్యవహరించిన బీజేపి కౌన్సిలర్ మనీష్ చౌదరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి రెండు వారాల క్రితమే జైలుకు పంపారు. కాగా, కౌన్సిలర్ మనీష్ చౌదరికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జుడీషియల్ రిమాండ్ నుంచి బెయిలుపై బయటకు వచ్చారు.
అయితే తమ నాయకుడు మనీష్ చౌదరి విడుదలపై అతని అనుచరులు కూడా చట్టానికి అతీతంగా వ్యవహరించారు. యధా రాజా తథా ప్రజ అన్న రీతిలో వ్యవహరించిన ఆయన అనుచురులు ఆయన విడుదల సందర్భంగా ఎస్ యూ వీ వాహనంలో ఆయన వెంట వెళ్తూ చేతిలోకి రివాల్వర్ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో కూడా అప్ లోడ్ చేసి అధికారం వుంటే అతీతశక్తులే అన్న చందాన వ్యవహరించారు. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
రెస్టారెంటులో దాడికి కారణమిదే:
బీజేపీ కౌన్సిలర్ మనీష్ చౌదరికి చెందిన ఓ రెస్టారెంట్ కు డిన్నర్ కోసం ఎస్ఐ సుక్పాల్ సింగ్ పవార్.. తనకు పరిచయస్తురాలైన ఓ మహిళా న్యాయవాదితో కలసి వచ్చారు. బోజనం అర్డర్ ఇచ్చారు. అయితే ఎంత సేవు వేచి చూసినా ఇంకా అర్డర్ రాకపోవడంతో వారు హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. అప్పటికీ వారికి సిబ్బంది బోజనం వడ్డించలేదు. దీంతో అసలే ఆకలితో నకనకలాడుతున్న వారు హోటల్ సిబ్బందిని తిట్టడం ప్రారంభించారు. విషయం తెలుసుకొని అక్కడకు వచ్చిన రెస్టారెంట్ ఓనరైన బీజేపీ కౌన్సిలర్ మనీష్ చౌదరికి ఎస్ఐ కి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవలోనే మనీష్ ఎస్ఐను చావగొట్టాడు. ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more