రాష్ట్రంలో ఓ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్న జనసేన పార్టీ.. ఇవాళ నిర్వహించిన కవాత్తుతో తన సత్తా ఎంటో రాష్ట్రంలోని ప్రత్యర్థి పార్టీలకు చాటిచెప్పింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల తరువాత కింగ్ మేకర్ మారుతామన్న ఆ పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ మాటలకు ధీటుగా ఇవాళ జన సైనికులు పెద్దస్థాయిలో కవాతుకు తరలివచ్చారు. రెండు లక్షల మందికి పైగా జనసైనికులు కదిలిరావడంతో.. పోలీసులు కూడా జనసేన పార్టీకి ఆంక్షలు విధించారు.
పవన్ పిలుపు మేరకు కదంతోక్కిన జనసైనికులను చూసిన పోలీసులు వారి ధాటికి ధవళేశ్వరం బ్యారేజీ సరిపోదని.. సభాస్థలిని వేరే చోటుకి మార్చాలని ఇవాళ ఉదయం పోలీసులు నోటీసులు అందజేశారు. ఇక చివరి నిమిషమంలో పోలీసులు అందజేసిన నోటీసులపై అసంతృప్తి వ్యక్తం కావడంతో.. పోలీసులు జనసేనాని పవన్ కల్యాణ్ కు కొన్న హెచ్చరికలు జారీ చేశారు. ముందుగా కాలినడకన కవాతు చేయకూడదని అంక్షలు విధించారు. అందుకుగల కారణాలను కూడా వివరించారు.
కాలినడకన పవన్ కల్యాణ్ కవాతు చేస్తే.. అతడ్ని కలుద్దామని, చూద్దామని వెనకనున్న జనసైనికులు ముందుకు నోట్టుకువచ్చే అవకాశం వుందని, దీంతో తొక్కిసలాట జరిగితే అటు వపన్ కల్యాణ్ తో పాటు ఇటు జనసైనికులకు కూడా ప్రమాదం సంభవించవచ్చునని హెచ్చరికలు చేశారు. దీంతో పవన్ కల్యాణ్ పిచుకల లంక నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకు కారులోనే కావాతు నిర్వహించారు. అయితే రెండున్నర కిలోమీటర్ల దూరంలో వున్న సభాస్థలికి చేరకునేందుకు.. వెల్లువలా తరలివచ్చిన జనసైనికులను దాటుకుంటూ పవన్ కల్యాన్ కారు ఏకంగా గంటన్నర సమయంపైగా తీసుకుంది.
కవాతు సందర్భంగా విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు బ్యారేజ్ పొడవునా జనసేన జెండాలు, ఫ్లెక్సీలతో ఆయా ప్రాంతమందా శ్వేతవర్ణమయమైంది. మధ్యమధ్యలో వామపక్షాల అరుణపతాకాలు.. ఇక జాతీయ జెండాలు కూడా ఆయన కవాతులో కనిపించాయి. బ్యారేజ్ దిగువన కాటన్ విగ్రహం సెంటర్లో బహిరంగ సభా వేదికను అందమైన పూలతో అలంకరించారు. పవన్ కల్యాణ్ పోరాట యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించిన నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ఈ కవాతును నిర్వహిస్తున్నారు. అనంతరం కాటన్ బ్రిడ్జి దగ్గర బహిరంగ సభ జరగనుంది. ఆ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more