ఆమ్ ఆద్మీ పార్టీ నేత, యూపీకి చెందిన నవీన్ దాస్ (25) దారుణ హత్యకు గురయ్యారు. రాజకీయంగా ఎదుగుతున్న ఆయనను ప్రత్యర్థులు జీర్ణంచుకోలేక ఆయన కారులోనే ఆయనను సజీవ దహనం చేశారు. బో ప్రా ప్రాంతంలోని సహీదాబాద్ రోడ్డులో ఆయన తన కారులో ప్రయాణిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. ఆయన్ను ఓ పథకం ప్రకారం కారులో ఎక్కించి, బయటి నుంచి లాక్ చేసి నిప్పంటించి వుంటారని బంధువులు అనుమానిస్తున్నారు.
వివరాలు.. బోప్రాలో ఓ కారుకు నిప్పంటించి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి పోలీసులు మంటలార్పి లోపల ఉన్న వ్యక్తిని బయటికి తీసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడు. కారు నంబరు ఆధారంగా మృతుడిని ఆప్ నేత నవీన్ దాస్ గా గుర్తించారు పోలీసులు. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నవీన్ ఎదుగుదలను జీర్ణంచుకోలేక ఈ దారుణాన్ని ప్రత్యర్థులు ఒడిగట్టారని వారు అరోపిస్తున్నారు.
తన సోదరుడు రాజకీయంగా ఎదుగుతూ ఉండటంతో ఓర్చుకోలేని ప్రత్యర్థులు ఈ హత్యకు పాల్పడ్డారని సవీన్ సోదరి ఆరోపించారు. రాత్రి 12 గంటలకు ఫోన్ రావడంతో అతడు బయటికి వెళ్లాడని, కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నవీన్ దాస్ను కారులోకి ఎక్కించి, బయటి నుంచి లాక్ చేసి నిప్పంటించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. నవీన్ కుటుంబాన్ని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more