పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్తాన్ 22వ ప్రధాన మంత్రిగా ఆయన దేశవిదేశీ అతిరధ మహారధుల మధ్య ప్రమాణస్వీకారోత్సవాన్ని చేశారు. తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేతగా పార్టీని స్థాపించిన నాటి నుంచి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసిన ఆయన పలు చిన్న పార్టీలతో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అతిరధుల సమక్షంలో ఆయన ప్రధానిగా ప్రెసిడెంట్ హౌస్లో బాధ్యతలు స్వీకరించారు.
అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఇమ్రాన్ ఖాన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. క్రికెటర్ గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్.. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లి తన సొంత పార్టీని స్థాపించారు. ఇమ్రాన్ ఖాన్ సమకాలికుడైన క్రికెటర్.. ఆ తరువాత ఇమ్రాన్ మాదిరిగానే రాజకీయాల్లోకి వచ్చిన భారత మాజీ క్రికెటర్.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఇమ్రాన్ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యారు. ఇందుకోసం ఆయన వాఘా సరిహద్దు ద్వారా శుక్రవారమే పాక్ చేరుకున్నారు. సిద్దూతో పాటుగా వసీం అక్రమ్ సహా పలువురు మాజీ క్రికెటర్లు, సైన్యానికి చెందిన అత్యున్నత అధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
కాగా, ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధూను పాక్ ఆక్రమిత కశ్మీర్ అధ్యక్షుడు మసూద్ ఖాన్ పక్కన కూర్చోబెట్టడం గమనార్హం. విదేశీ నేతల సరసన సిద్ధూను కూర్చోబెట్టకుండా.. పీవోకే పాలకుడి పక్కన కూర్చోబెట్టడం విమర్శలకు తావు ఇస్తోంది. ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి ముందు.. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమార్ జావేద్ బజ్వాను సిద్ధూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘నేను ఇక్కడికి రాజకీయ నాయకుడిగా రాలేదు. భారత సహృద్భావ రాయబారిగా వచ్చా’నని సిద్ధూ తెలిపారు.
Islamabad: Navjot Singh Sidhu was seated next to President of PoK Masood Khan at Imran Khan's oath ceremony. #Pakistan pic.twitter.com/MPrBQ9XtXD
— ANI (@ANI) August 18, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more