మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మృతి చెందిన నేపథ్యంలో ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన ఔనత్యం గురించి దేశప్రజలు అసక్తిని కనబరుస్తున్నారు. ఆయన వాఖ్ఛాతూర్యం, పద వినియోగం, కవిత్వాలు, వక్త కావడంతో ప్రసంగాలను కూడా వినేందుకు దేశ ప్రజలు అవితాసక్తిని కనబరుస్తున్నారు. అయితే రాజీవ్ గాంధీని ఆయన తన సోదరుడని మరింతగా చెప్పాలంటే తన తమ్ముడని అభివర్ణించారని అంతేకాక తన ప్రాణప్రధాతగా నిలిచారన్న వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి.
రాజకీయాల్లో విలువ వలువలకు వన్నె తెచ్చిన ఆయన ప్రత్యర్థి నేతను కూడా సోదర సమానుడని అభివర్ణించడం.. ప్రాణప్రధాతగా కొనియాడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీని వెనుక పెద్ద కథే వుంది. ఇది కూడా రాజీవ్ గాంధీ మరణించిన నేపథ్యంలో స్వయంగా వాజ్ పేయ్ రాజీవ్ గాంధీకి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆ సందర్భంలోనే ఈ విషయాన్ని బయటపెట్టారు. తాను బతికి ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ వల్లేనని వాజ్పేయి పేర్కొన్నడంతో అప్పట్లో ఈ విషయం పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా ఇప్పుడు మాత్రం నెట్టింట్లో సంచలనంగా మారింది.
వీరిద్దరి మధ్య ఆ అవినాభావ సంబంధం ఎలా ఏర్పడిందని అంటే.. వాజ్ పేయి వెలువరించే వరకు ఈ విషయం బీజేపి నేతలకే కాదు ఆయన సన్నిహితులకు కూడా తెలియదు. అసలేం జరిగింది.? అంటే.. రాజీవ్ గాంధీ ప్రధానిగా కొనసాగిన హయాం 1984-89లో అప్పటి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న వాజ్ పేయి.. అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1988లో వాజ్ పేయి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. విదేశాల్లో చికిత్స చేయించుకుంటే తప్ప కష్టం. అప్పట్లో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వాజ్పేయి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి తెలిసింది.
విషయం తెలిసిన వెంటనే వాజ్పేయిని తన కార్యాలయానికి రమ్మని రాజీవ్ ఆహ్వానించి మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి సదస్సుకు వెళ్లే బృందంలో మిమ్మల్ని కూడా చేర్చుతున్నానని, కాబట్టి సదస్సు అనంతరం న్యూయార్క్ వెళ్లి వైద్యం చేయించుకోవాలని వాజ్పేయికి సూచించారు. దీనికి వాజ్పేయి సరేననడంతో అలా కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని వాజ్పేయి స్వయంగా సీనియర్ పాత్రికేయుడు కరణ్ థాపర్తో పంచుకున్నారు. తానీ రోజు బతికి ఉన్నానంటే దానికి కారణం రాజీవ్ గాంధీయేనని వాజ్పేయి పలుమార్లు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more