మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరుగుతున్న ఏటీఎం మోసాల కేసులో ముగ్గురు సభ్యుల ముఠా వుందని తెలుసుకున్న పోలీసులు ఈ మోసాలకు పాల్పడిన ప్రధాన నిందితుడు మాత్రం దుబాయ్ కి పారిపోయాడని తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ కేసులో మూడు ఏటీఎం కేంద్రాల వద్ద జరిగిన మోసాల్లో ఓ అమ్మాయి పాత్ర కూడా వుందని అప్పటికే సేకరించిన సమాచారంతో అమెను అదుపులోకి తీసుకున్నారు. అమెను కోర్టులో హాజరుపర్చిన నేపధ్యంలో న్యాయస్థానం అమెను ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.
ఈ క్రమంలో అమె బ్యాక్ గ్రౌండ్ తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. అమె ఏకంగా ఓ అయినింటి (సంపన్న కుటుంబానికి చెందిన) యువతిగా గుర్తించారు. అమె తండ్రి ఓ రిటైర్డు సివిల్ ఇంజనీర్ అని కూడా తెలుసుకున్నారు. ఆ తరువాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆయన బిల్డర్ గా కూడా పదవీ విరమణ తరువాత కూడా చక్కగా అర్జిస్తున్నాడని తెలుసుకున్నారు. ఇక నెలకు యాభై వేల రూపాయలను ఆయన తన కూతురుకి పాకెట్ మనీగా ఇస్తున్నాడని కూడా తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు.
ఇక యువతి తల్లి కూడా ఓ ప్రోఫెసర్ అని తెలుసుకున్న పోలీసులు ఇలాంటి యువతి ఎందుకని దోంగతనాలకు పాల్పడిందన్న కోణంలో విచారించగా.. అమె చెడు వ్యసనాల కారణంగానే వక్రమార్గం పట్టిందని తెలుసుకున్నారు పోలీసులు. అమెకు మొదటగా పరిచయమైన మహమ్మద్ హుస్సేన్ హకాం.. అమెను ఏటీఎం మోసాల కేసులో ప్రధాన నిందితుడైన మహమ్మద్ ఫైజాన్ తో పరిచయం చేశాడు. దీంతో వీరంతా కలసి ఏటీఎం మోసాలకు స్కేచ్ వేసి.. ముంబైకి దూరంగా వున్న భోపాల్ లోని గుల్మొహర్ కాలనీలో ఈ మోసాలకు పాల్పడ్డారు.
స్కిమ్మర్ లు, కెమెరాలు అమర్చి డెబిట్ కార్డులను క్లోనింగ్ చేసి, 73 మంది ఖాతాదారుల నుంచి రూ. 17 లక్షలకు పైగా ఈ ముఠా దోపిడీ చేసింది. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి అయిన ఫైజన్ మోసాలకు పాల్పడగా, హకం మాత్రం ఏటీయం కేంద్రాలలో అర నిమిషంలో స్కిమ్మింగ్ మిషన్ల్, పాస్ వర్డ్ తెలుసుకునేందుకు అద్దాన్ని ఏర్పాటు చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక హోటల్ రికార్డుల ప్రకారం ముంబై ప్రముఖ కాలేజీ నుంచి ఎంబీఏ పొందిన అయాషా ఖాజీ గా గుర్తించామన్నారు. అమె మాదకద్రవ్యాలకు బానిసై చదువుకోసం తన తండ్రి పంపిన డబ్బులన్నింటినీ ఖర్చుచేసిందని దీంతో ఏటీఎం మోసాల ముఠాలో సభ్యురాలిగా మారిందని కూడా తెలుసుకున్నారు పోలీసులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more