పల్లెటూర్లను వదిలి పట్టణాలకు చేరుకున్నాం.. ఉమ్మడి కుటుంబాల నుంచి ఒంటరి కుటుంబాలను వేరుచేసుకున్నాం.. ఇక పిల్లల్ని పట్టించుకునే బదులు సీరయళ్లు, సెల్ ఫోన్లనే స్నేహితులుగా చేసుకుంటున్నాం,. కనీసం వారికి ఎది మంచి ఏది చెడు అన్న విషయాలతో పాటు సభ్య సమాజంలో ఎలా మెలగాలన్న విషయాలను కూడా నేర్పించలేకపోతున్నాం. దీంతో చిన్ననాటి నుంచే సెల్ ఫోన్లలో గేములు అడుతూ.. అందులోనూ ఎలాంటి గేమ్స్ అడుతున్నారన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా.. వదిలేస్తున్నారు. దీంతో మైనర్ బాలురు ఒంటిరి జీవితం.. నేర ప్రవృత్తికి కూడా దారితీస్తుందన్న విషయం ఇటీవల జరిగిన దారుణ ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇందుకు హైదరాబాద్ నగర శివార్లు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
హైదరాబాద్ ఉప్పల్ లో ఓ ఇంటర్ విద్యార్థి తన తోటి స్నేహితుడి వద్దనున్న సెల్ ఫోన్ కోసం నిర్థాక్షిణ్యంగా హతమార్చాడు. ఇంటర్ విద్యార్థుల్లో ఈ తరహా నేరప్రవర్తన పెరుగుతుండటం అనేక మందిని అందోళనకు గురిచేస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. సాగర్ అనే ఇంటర్ విద్యార్థికి ప్రేమ్ అనే స్నేహితుడు వున్నాడు. అతను కూడా ఇంటర్ చదువుతున్నాడు. అయితే ప్రేమ్ ఇంటికి వెళ్లిన సాగర్ లాంగ్ డ్రైవ్ కు వెళ్తామని చెప్పి ప్రేమ్ ను అతని ఇంటి వద్దనుంచి తీసుకెళ్లాడు. అదిభట్లకు చేరకున్న తరువాత సాగర్ తన మేకవన్నె పులి రూపాన్ని చూపాడు. ప్రేమ్ వద్దనున్న సెల్ ఫోన్ ను తీసుకున్న తరువాత అతన్ని అక్కడే హత్య చేసి.. కాల్చేశాడు. ప్రేమ్ కనిపించడం లేదన్న తల్లిదండ్రుల పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా సాగర్ చేతిలో దారుణంగా హత్యచేయబడ్డాడని తెలిసి.. ప్రేమ్ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు.
ఇక మరో ఘటనలో ఇంటర్ స్టూడెంట్స్ మధ్య జరిగిన ఫైటింగ్.. ఓ విద్యార్థి ప్రాణం తీసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి హూడా ట్రేడ్ సెంటర్లో ఈ ఘటన జరిగింది. ఇంటర్ విద్యార్థి అజయ్బాబును మరో విద్యార్థి సంపత్ కత్తితో పొడిచాడు. ఆదివారం అర్థరాత్రి (జూలై-15) ఈ స్టూడెంట్స్ మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో వారు మందు తాగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇద్దరి మధ్య మాటమాటా పెరిగింది. ఆవేశంలో సంపత్.. కత్తితో అజయ్ బాబుపై దాడి చేశాడు. పొత్తి కడుపులో పొడిచాడు. ఈ ఘటన చూసిన స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే అజయ్ బాబు కుప్పకూలిపోయాడు. యువకుడిని.. స్థానికులే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అజయ్ బాబు చనిపోయాడు. ఇద్దరు విద్యార్థులు చందానగర్ హూడా కాలనీలోనే నివాసం ఉంటున్నారు. స్నేహితులు అని కూడా చెబుతున్నారు. ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్ను అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more