టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కాసింత దూకుడు స్వభావంతోనే క్రికెట్ కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించలేకపోయాడన్నది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం. సచిన్ తో పాటు కెరీర్ ప్రారంభించిన కాంబ్లీ.. సచిన్ ను అందుకోలేనంత స్థాయికి పడిపోయాడు. ఇప్పుడు తన తప్పులు తెలుసుకుని అందరితో అప్యాయంగా మసలుతున్న వినోద్ కాంబ్లీకి తాజాగా మళ్లీ చిక్కులు వచ్చిపడ్డాయి. ఆయన భార్య కూడా అలాంటి స్వభావంతోనే వ్యవహరించారని అమెపై పోలీస్ పిర్యాదు నమోదయ్యింది. ఈ మేరకు బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ తండ్రి ఈ ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకి వెళితే.. ముంబై ఇనార్బిట్ మాల్ లో క్రితం రోజున నిర్వహించిన ఓ కార్యక్రమంలో అహుతులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీతోపాటు అతని భార్య ఆండ్రియా కూడా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ, అతని తండ్రి కూడా పాల్గొన్నారు. ఓ అంశంపై వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా.. అంకిత్ తో వాదనకు దిగారు. ఈ క్రమంలో మాట మాట పెరిగింది. దీంతో సహనం కోల్పోయిన ఆండ్రియా.. అంకిత్ పై చేయిచేసుకున్నది.
అయితే తన ముందే తన కన్న కొడుకుపై అండ్రియా చేయిచేసుకున్న నేపథ్యంలో సహించలేకపోయిన అంకిత్ తండ్రి వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. అండ్రియాపై కేసు పెట్టాడు. దీనిపై కాంబ్లీ కూడా స్పందించాడు. ఆండ్రియాతో అసభ్యంగా ప్రవర్తించాడని, అమె చేయి పట్టుకున్నాడని.. ఈ క్రమంలో అమె ప్రశ్నించడంతో.. అతను మరింతగా రెచ్చిపోవడం.. అనుచిత ప్రవర్తన, అసభ్యపదజాలం వినియోగించడంతోనే అమె చేయి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. కాగా, మొదటగా అంకిత్ తండ్రి నుంచి ఫిర్యాదు రావటంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు కాంబ్లీ ఫ్యామిలీ మాత్రం ఎలాంటి కంప్లయింట్ ఇవ్వలేదు. అంకిత్ వ్యవహరించిన తీరుపైనా ఆండ్రియా కంప్లయింట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more