గత కొన్నేళ్ల క్రితం వరకు బీహార్ లో కోనసాగిన అటవిక రాజ్యం, కిరాకతాలకు ఇప్పుడు గుజరాత్ అడ్డాగా మారిందా.? అంటే అవుననే నిరూపించేట్టుగానే జరిగింది ఈ ఘటన. యావత్ దేశానికి గుజరాత్ మోడల్ ను చూపించి.. దేశ ప్రధానిగా ఎన్నుకోబడిన నరేంద్రమోడీ.. తన సోంత రాష్ట్రంలో అత్యంత దారుణ, కిరాతక ఘటన చోటుచేసుకుంది. ఓ వైపు దళిత ఎంపీలు తమకు బీజేపి పార్టీ చేసింది ఏమీ లేదని సాక్ష్యాత్తు పార్టీపైనే ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న క్రమంలో.. గుజరాత్ లోనే దళిత వర్గానికి చెందిన వ్యక్తిని రాడ్లతో దారుణంగా కోట్టి చంపారు.
దళితుడిని తాళ్లతో కట్టేసి విచక్షణారహితంగా ఇనుపరాడ్లతో కొట్టి చంపిన అతి దారుణ ఘటన చోటు చేసుకుంది. ముఖేష్ వనియా అనే వ్యక్తి తన భార్యతో కలిసి రాజ్ కోట్ లో చెత్త ఏరుకుని జీవనం సాగించేవాడు. నిన్న ఉదయం ఓ కర్మాగారం వైపునకు వెళ్లగా.. అతడిని అడ్డుకున్న కొందరు ఉద్యోగులు దొంగ అని ఆరోపిస్తూ చావబాదారు. అసలు ఎందుకు కొడుతున్నారో.. ఎంతగా కొడుతున్నారన్న విఛక్షణ కోల్పోయిన ఉద్యోగులు అతిదారుణంగా దళిత వర్గానిక చెందిన వ్యక్తి అసువులు తీశారు. దెబ్బలకు తాళలేక వద్దు వద్దూ ఇక అపండీ.. తానేం తీసుకోలేదని ఎంతగా బతిమాలినా కరుణించలేదు కర్కోటకులు.
అంతేకాదు, ఆ దళితుడి భార్యపై కూడా కర్రలతో దాడి చేశారు. ముఖేష్ భార్య తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోను గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసి, దళితులకు గుజరాత్ క్షేమదాయకం కాదని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం జరిగిన ఉనా దాడికంటే ఇది అత్యంత దారుణ ఘటన అని, కుల ఘర్షణలతో అమాయకులు మృతి చెందుతున్నా తమ రాష్ట్ర సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more