కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. భయంకరమైన అనుభవం నుంచి బయటపడిన క్రమంలో కర్ణాటక ఎన్నికల తరువాత తాను మానస సరోవర్ వెళ్లి కైలాష్ నాథ్ దర్శనాన్ని చేసుకుని వస్తానన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ‘జన్ ఆక్రోశ్’ ర్యాలీ ఆయనే స్వయంగా చెప్పి.. కాంగ్రెస్ శ్రేణుల అనుమతిని కూడా కోరిన విషయం తెలిపిందే. కాగా, ఈ లోపు జన్ అక్రోశ్ సభ ఇచ్చిన వెన్నుధన్నో లేక.. కర్ణాటకలో తామే గెలుస్తామన్న ధీమానో తెలియదు కానీ.. తన స్నేహితులతో కలసి కొంత రిలాక్స్ కావాలని భావించారు.
అంతే అనుకున్నదే తడవుగా ఆయన తన స్నేహితులతో కలసి ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ లో ఉన్న ఐనాక్స్ థియేటర్ ఇటీవలే విడుదలై సంచలనాలకు తెరతీస్తూ కలెక్షన్లు రాబడుతున్న ‘అవెంజర్స్: ఇన్ ఫినిటీ వార్’ సినిమాను వీక్షించారు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం కూడా వుంది. రాహుల్ గాంధీ నిత్యం కనిపించే విధంగా తెలుపు రంగు దుస్తుల్లో కాకుండా.. ఈసారి కొత్తగా టీషర్ట్లో కన్పించారు. ఈ తరహా డ్రెసింగ్ లో రాహుల్ నిజంగానే యువరాజులా అగుపించారు.
అయితే రాహుల్ సినిమా చూడటంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఓ పక్క ఎన్నికలు దగ్గరపడుతుంటే ఇప్పుడు రాహుల్కి సినిమా చూడాల్సిన అవసరం ఏముందంటూ విమర్శలు చేస్తున్నారు. వీటిపై ఓ కాంగ్రెస్ నేత స్పందిస్తూ..‘1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపి ఓడిపోయినప్పుడు అటల్ బిహారీ వాజ్ పేయ్, ఎల్కే అద్వానీ కూడా ఢిల్లీలోని ఓ థియేటర్ లో సినిమా వీక్షించేందుకు వెళ్లారు. గుజరాత్ ఎన్నికలు, ‘జన్ ఆక్రోశ్’ ర్యాలీ తర్వాత ఎంతో అలసిపోయిన రాహుల్ ఒక సినిమా చూస్తే తప్పేంటి?’ అని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more