పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు యాక్సిస్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు సహా పలు బ్యాంకులలో 13 వేల కోట్ల రూపాయల రుణాన్ని పొంది వాటిని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అరెస్ట్ అయ్యాడు. ఆయనను హాంకాంగ్ లోని ప్రత్యేక పరిపాలనా ప్రాంతంలో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్ విన్నవించిన పక్షంలో వారి వినతికి అనుగూణంగా హాంకాంగ్ స్థానిక చట్టాలకు లోబడి నీరవ్ మోదీని అరెస్ట్ చేసి విచారిస్తామని చైనా అధికార ప్రతినిధులు తెలిపారు.
హాంకాంగ్ లోని ప్రత్యేక పరిపాలనా ప్రాంతంలోని పోలీసులు నిరవ్ మోదీని అదుపులోకి తీసుకున్నట్లుగా గతవారం భారత విదేశాంగ సహాయ మంత్రి వికే సింగ్ పార్లమెంటుకు తెలిపారు. నిరవ్ మోదీ కుంభకోణాలు బయటపడకముందే ఆయన విదేశాలకు పారిపోయారు. ఆ తరువాత అమెరికా, లండన్ ఇలా పలు దేశాలలో నీరవ్ మోదీ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల అతడు హాంకాంగ్లో ఉన్నాడని పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఉభయ దేశాల న్యాయ సహకారం ఒప్పందాల మేరకు మోదీని హాంకాంగ్ విచారిస్తుందని చైనా అధికారులు స్పష్టం చేశారు.
అలక్ష్యం చేసిన ఫలితమే..
కాగా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ స్కామ్ బట్టబయటు అయ్యేందుకు సరిగ్గా ఏఢాది క్రితమే సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ అధికారులు బ్యాంకులను అప్రమత్తం చేశారు. అయితే వారి అలర్ట్ సంకేతాలను తేలిగ్గా తీసుకున్న క్రమంలోనే బ్యాంకుల్లో వరుసగా బంగారు, వజ్ర వ్యాపారుల కుంభకోణాలు వెలుగుచూశాయి. అయితే ఇందులో అత్యంత భారీ కుంభకోణమైన నిరవ్ మోడీకి సంబంధించిన మొత్తమే 13 వేల 600 కోట్లకు పైగా వుండటంతో సీవీపీ అధికారులు తాజాగా ఈ వివరాలను బయటపెట్టారు.
2017 జనవరి 5న సెంట్రల్ విజిలెన్స్ అధికారులు ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో సీబీఐ సీనియర్ అధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్, 10 బ్యాంకులకు చెందిన చీఫ్ విజిలెన్స్ అధికారులు పాల్గోన్నారు. వారిలో పంజాబ్ నేషనల్ బ్యాంకు తరపున కూడా ఓ ఉన్నతాధికారి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వజ్రాలు, బంగారు అభరణాల రంగానికి ఇచ్చిన రుణాల్లో తీవ్ర అవకతవకలపై సెంట్రల్ విజిలెన్స్ అధికారులు బ్యాంకు అధికారులను అప్రమత్తం చేశారు. విన్సమ్ గ్రూపునకు చెందిన జతిన్ మెహతా చేసిన మోసాలపై చర్చించిన అధికారులు ఈ బంగారు, వజ్రాల రంగాల వారికి ఇచ్చిన రుణాలపై కూడా అలర్ట్ చేశారు.
అయినా బ్యాంకులు దీనిపై దృష్టి సారించలేదని, అందుచేతే అటు నిరవ్ మోడీ సహా ఈ రంగంలోని చిన్న వ్యాపారులు కూడా బ్యాంకులకు కుచ్చుటోపి వేశారని చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి అన్నారు. ఈ అంశమై ఆయన మాట్లాడుతూ... విన్సమ్ గ్రూపునకు చెందిన జతిన్ మెహతా బ్యాంకులకు చేసిన మోసాలపై తమ సమావేశంలో చర్చించామని, ఈ సందర్భంగా ఇతర జ్యుయలరీ సంస్థలకు ఇచ్చిన రుణాల్లో అవకతవకలపైనా చర్చించినట్టు చౌదరి చెప్పారు. లేని పక్షంలో పీఎన్బీ బ్యాంకులో మోదీ స్కామ్ అయన విదేశాలకు పరారీ కాకముందే వెలుగులోకి వచ్చేదని అభిప్రాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more