బీజేపీ ఎంపీలకు రానున్న సార్వత్రిక ఎన్నికలలో గెలుపుసూత్రాలను ఫాలో కావాలని అందుకు ఇటు పేద, బడగువర్గాల ప్రజలతో కలసి వుండటంతో పాటు అటు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశం ప్రసంగించిన ప్రధాని.. ఎంపీలందరూ తప్పనిసరిగా ట్విటర్ లో అధికారిక ఖాతాలు తెరవాలనీ అదేశించారు. ఒక్కో ఎంపీకి కనీసం మూడు లక్షలకు తగ్గకుండా ఫాలోవర్లు ఉండాలని సూచించారు.
ఈ అకౌంట్ల ద్వారా ప్రతిపక్ష పార్టీలు చెబుతున్న అబద్ధాలను ఎండగట్టేందుకు ఎంపీలంతా ప్రజల్లోకి వెళ్లాలన్నారు. మారుతున్న టెక్నాలజీని అనుకూలంగా ఉపయోగించుకుంటూ ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న పనులు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై.. ఎప్పటికప్పుడు సమాచారం అందించడంతో పాటు వాస్తవాలు తెలియజేయాలని అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కట్టుకథలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని . దీన్ని తిప్పికొట్టేలని ఆయన చెప్పారు. మన సందేశం సామాన్య ప్రజలకు చేరాలని ప్రధాని మోదీ చెప్పినట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు.
సమకాలిక ప్రజాస్వామ్యంలో ఆన్లైన్లో ఓటర్లకు ఎలా దగ్గరకావాలో చెబుతూ ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టు చెబుతున్నారు. 2014 నుంచి ప్రభుత్వం సాధించిన విజయాలను అన్ని నియోజకవర్గాల్లోని ప్రజలకు వివరించాలని కూడా ఎంపీలకు సూచించినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మొత్తం 43 మంది బీజేపీ ఎంపీలకు ఫేస్బుక్ ఖాతాలు లేవని తేలింది. ఫేస్బుక్ ఉపయోగిస్తున్న వారిలో 77 మంది అకౌంట్లకు ఇంకా వెరిఫికేషన్ పూర్తికాలేదని గుర్తించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంతో పాటు ఎంపీలు తమ నియోజక వర్గాల్లో మీడియా సమావేశాలు నిర్వహించడం కూడా కీలకమేనని బీజేపీ సారధి అమిత్షా నొక్కిచెప్పినట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more