నగర విద్యార్ధుల్లో నేర ప్రవృత్తి పెరుగుతోంది. విద్యార్థి దశలోని పిల్లలు తీవ్రమై బావోద్వేగాలకు, ఉద్రేకాలకు లోనవుతున్నారు. ఈ విషయాలను తల్లిదండ్రులు పర్యవేక్షించడంలో విఫలం అవుతున్నారు. ఇటీవల మాటామాట పెరిగిన మేడ్చల్ లోని ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని తన సహచర విద్యార్థే కత్తితో గాయపర్చిన ఘటనను మర్చిపోకముందే.. కూకట్పల్లిలో ఓ ఇంటర్ విద్యార్థి సుధీర్ పై సహచర విద్యార్థులు ఏకంగా కత్తులు, వేటకొడవళ్లతో వెంటాడి, వెంబడించి.. వేటకొడవళ్లతో హత్య చేశారు. నిత్యం రద్దీగా వుంటే జాతీయ రహదారిపై యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. కూకట్ పల్లి ఏసీబీ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట జనతానగర్ లో సుధీర్.. కూకట్ పల్లిలోని ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్ష రాసేందుకు ఇవాళ ఉదయం తన స్నేహితులైన మేఘనాథ్, సాయిలతో కలిసి సుధీర్ బైక్పై బయలుదేరాడు. వారు కూకట్పల్లి జేఎస్పీ హోండా షోరూం వద్దకు చేరుకోగానే అప్పటికే సుధీర్ కోసం మాటు వేసిన నలుగురు దుండగులు సుధీర్ వాహనాన్ని అడ్డగించి వేటకొడవళ్ళతో దాడి చేశారు. తప్పించుకుని పారిపోతుండగా వెంటాడి.. వేటాడి నరికి చంపేశారు. వారిని అడ్డగించేందుకు ప్రయత్నించిన సాయి, మేఘనాథ్ పై దాడికి ప్రయత్నించటంతో వారు అక్కడి నుండి పారిపోయారు.
హత్య చేసిన అనంతరం అక్కడి నుండి పారిపోతున్న నలుగురిలో ఒకరని అక్కడే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పరమేష్ పరుగెత్తి పట్టుకున్నాడు. అప్పటికే స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. మూసాపేటలో నివసించే కృష్ణ, మహేష్, తేజ, నవీన్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో మహేష్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more