Odisha MP hospitalised after collapsing in Parliament పార్లమెంటులో కుప్పకూలిన ఎంపీ.. అపస్మారక స్థితిలోకి..

Odisha mp av swamy hospitalised after taking ill in parliament

a.v. swamy, Alajangi Viswanath Swamy, odisha mp, injured, parliament, rajya sabha, odisha, ram manohar lohia hospital, delhi

Rajya Sabha member from Odisha, A.V. Swamy was today hospitalised after he collapsed on the Parliament premises here today.

పార్లమెంటులో కుప్పకూలిన ఎంపీ.. అపస్మారక స్థితిలోకి..

Posted: 02/09/2018 03:18 PM IST
Odisha mp av swamy hospitalised after taking ill in parliament

నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించడంతో పాటు విజభజ చట్టంలో పొందుపర్చిన హామీలన్నింటినీ తక్షణమే నెరవేర్చాలన్న డిమాండ్ తో గత వారం రోజులుగా టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల అందోళనతో అట్టుడుకుతున్న క్రమంలో ఇవాళ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ వైపు టీడీపీ సభ్యుల నిరసనలతో తన భాద్యను కూడా వ్యక్తం చేసే అవకాశం లేని ఓ పార్లమెంటు సభ్యుడు రాజ్యసభలోనే కుప్పకూలిపోయాడు.

ఈ విషయాన్ని గమనించిన సహచర ఎంపీల సమాచారంతో భద్రతా సిబ్బంది అయనను హుటాహుటిన అసుప్రతికి తరలించింది. ఒడిశాకి చెందిన పార్లమెంటు సభ్యుడు ఎ.వి. స్వామి ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. పార్లమెంటు ప్రాంగణంలోకి వస్తూ వస్తూనే కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి చేరడంతో హుటాహుటిన ఆయనను ఢిల్లీలోని రామ్‌ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆయన ఎందుకు కుప్పకూలారన్న వివరాలు తెలియరాలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఎగువ సభలో ప్రకటన చేశారు. స్వామి ఉన్నట్టుండి ఎందుకు స్పృహతప్పి పడిపోయారనే దానిపై స్పష్టత రావాల్సిఉందన్నారు. ఒడిశా నుంచి స్వతంత్ర ఎంపీగా కొనసాగిన ఆయన... 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles