తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాలలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓ వైపు దేశంలోనే ప్రముఖ నటులుగా ఖ్యాతిని సొంత చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, మరోవైపు విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇద్దరూ రాజకీయ పార్టీలను స్థాపించి.. 2021లో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో తలపడేందుకు తాము సిద్దమని ఇప్పటికే ప్రకటించడంతో... రాజకీయ ఈక్వేషన్లు శరవేగంగా మారుతున్నాయి.
ఇప్పటికే అమ్మ నిచ్చెలి, చిన్నమ్మగా పేరొందిన శశికళ అన్నాడీఎంకే పార్టీని చేజిక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు..ఒకింత విజయవంతంగా కాగా, అమె ఎత్తులకు పైఎత్తులు వేసిన అధికారపక్షం అమెను చిత్తు చేసి కటకటాల్లోకి పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ తొలుత రెండు తరువాత మూడు ఆ తరువాత మళ్లి రెండువర్గాలుగా చీలిపోవడం తెలిసిందే. ఇటీవల జరిగిన అర్కే నగర్ ఎన్నికలలో కూడా శశికళ మేనల్లుడు దినకరణ్ గెలుపోందారు. దీంతో జయలలిత మరణం నుంచి ఒక రకంగా తమిళనాడులో రాజకీయ అనిశ్చిత నెలకొందని చెప్పక తప్పదు.
తమిళనాడు ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్ది.. రాష్ట్ర సర్వోతముఖాభివృద్దికి దోహదపడే రాజకీయ నాయకులు కావాలన్న కాంక్షను ఇన్నాళ్లుగా వ్యక్తం చేసిన రజనీకాంత్.. అమ్మ మరణం తరువాత మాత్రం ఈ నేతను తానే ఎందుకు కాకూడదని ప్రశ్నించుకున్నట్లు వున్నారు. దీంతో తాను రాజకీయ పార్టీని త్వరలోనే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ఇటు తమిళనాడుతో పాటు యావత్ దేశంలో సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు తమిళనాడులో మధ్యంతర ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా వుంటుందన్న విషయమై ఇండియా టుడే-కార్వీ సంస్థ నిర్వహించింది. అయితే ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగితే డీఎంకే అధికారంలోకి వస్తుందని సర్వే తేల్చింది. అంతేకాదు.. ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావమో ఏమో తెలియదు కానీ.. రజనీకాంత్ పార్టీకి కేవలం 33 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది.
దీంతో రజనీకాంత్ రాజకీయాలలో రాణించగలడా..? అన్న సందేహాలు కూడా ఉత్పన్నమవుతువున్నాయి. అయితే ఎంట్రికీ ముందుకు అందరి పరిస్థితి ఇంతేనని, అరంగ్రేటం చేసిన తరువాత పరిస్థితులే వారినిన రాటు తేలేనా చేస్తాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాగా జయలలిత మరణం తరువాత రాజకీయ శూన్యత ఆవరించిందని 65 శాతం మంది అభిప్రాయపడగా, అన్నాడీఎంకేది ఇక చరిత్రేనని మోజరిటీ సభ్యులు పేర్కొన్నారు. అయితే అన్నాడీఎంకేకు దూరమైన వారిలో 60 శాతం మంది రజనీకాంత్వైపు, 26 శాతం మంది డీఎంకేవైపు మొగ్గు చూపుతున్నారు. ఇక స్టాలిన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more