పండుగ పర్వదినాన.. తన సొంతూరికి వెళ్లి అక్కడే తన కుటుంబ సభ్యలతో వేడుకలను జరుపుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సారి మాత్రం ఓ అనన్యసామాన్యమైన పని చేశాడు. ఏకంగా రాజకీయ విమర్శకుల చేత కూడా శబాష్ అనిపించుకున్నాడు. అదేంటి.. అంటారా..? ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఓ సామాన్య యువకుడిని గ్రామప్రజల సాక్షిగా క్షమాపణలు కోరడమే. వినడానికే అశ్చర్యంగా వున్నా ఇది ముమ్మాటికీ నిజం. సామాన్యులు షాకయ్యేలా వున్నా ఈ వార్తే ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమైంది.
నారావారిపల్లె వచ్చిన చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులు అర్పించి.. తిరిగి వస్తూ రోడ్డు పొడవునా బారులు తీరిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. దీంతో పోలీసులు అటుగా వాహనాల రాకపోకలను నిలిపేశారు. అదే సమయంలో పులిచెర్ల మండలం దిగువమూర్తిపల్లెకు చెందిన నవీన్ కుటుంబసభ్యులతో కలిసి రంగంపేట నుంచి నడుచుకుంటూ నారావారిపల్లెకు వచ్చి బస్సు కోసం ఎదురుచూస్తూ ఇబ్బంది పడ్డాడు. ఎంతకీ బస్సులు రాక అసహనం వ్యక్తం చేసి.. అక్కడున్న వారిని ప్రశ్నించాడు.
అక్కడే వున్న చంద్రబాబు నవీన్ ను చూసి దగ్గరకు పిలిచి ఏం జరిగిందని విచారించాడు.. దీంతో యువకుడు బదులిస్తూ రెండు గంటలుగా వాహనాలను నిలిపివేశారని, పండుగ పూట ఇలా ఇళ్లకు పోనివ్వకుండా రోడ్డుపై బస్సులు ఆపేయడం ఏమీ బాగోలేదని.. చిన్నపిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారని, కళ్లు తిరిగి పడిపోయేలా ఉన్నారని అవేదన వ్యక్తం చేయడంతో చలించిన చంద్రబాబు.. ‘‘అయామ్ సారీ అమ్మా, ఇకపై అలా జరగదు. ఎస్పీకి చెబుతాను’’ అంటూ సముదాయించారు. ట్రాఫిక్ను పునరుద్ధరించాలని పోలీసులను ఆదేశించారు. చంద్రబాబు సారీ చెప్పడం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయేలా చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more