గుజరాత్ లో తాము మొత్తం 150 సీట్లను సాధిస్తామని చెప్పిన బీజేపి ఆ రాష్ట్ర ప్రజలు కేవలం 99 స్థానాలను మాత్రమే ఇవ్వడంతో ఇప్పటికే పార్టీ నేతలు పోస్టుమార్టం సమావేశాలు నిర్వహణకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈ ఫలితాలపై 22 ఏళ్ల తరువాత కూడా తమ పార్టీ, ప్రభుత్వం పక్షానే ఆ రాష్ట్ర ప్రజలు వున్నారని, ఇది సంతోషించదగిన పరిణామమని బీజేపి నేతలు చెబుతున్నా.. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం మాత్రం చాలానే వుందని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ రెండో విడతకు ముందు చేసిన అఘాయిత్యపు వ్యాఖ్యలే తమ అంచనాలను దెబ్బతీశాయని కూడా అంటున్నారు. అయితే ఈ ఎన్నికలపై నటి, నిర్మాత, వ్యాపారవేత్త మంచు లక్ష్మి చేసిన ట్విట్ ఇప్పుడు వైరల్ గా మారింది. బీజేపి నేతలు 150 సీట్లు సాధిస్తామని చెప్పిన క్రమంలో కేవలం 99 స్థానాలను మాత్రమే పరిమితమైన నేపథ్యంలో అమె బీజేపికి వారు తీసుకువచ్చిన అర్థిక సంస్కరణ తాలూకు విషయాన్ని ఊటంకిస్తూ చేసిన ట్విట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
'ఫౌండ్ దిస్ ఫన్నీ' అంటూ, అమె ఈ ట్విట్ చేశారు. 182 సీట్లున్న గుజరాత్ లో అమిత్ షా 150 సీట్లను అడిగారు. గుజరాత్ ప్రజలు మొత్తం సీట్ల నుంచి 28 శాతం జీఎస్టీని తీసేసి 99 సీట్లు ఇచ్చారు. అంటూ 150లో 28 శాతం తీసేస్తే మిగిలేది 99 సీట్లని గుర్తు చేశారు. 182లో 28 శాతం అంటే 51 అవుతుంది. బీజేపీ అడిగిన 150 సీట్లలో 51 సీట్లను తీసేస్తే మిగిలేది 99. అవే బీజేపీకి వచ్చాయన్న అర్థంలో మంచు లక్ష్మి పెట్టిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారింది.
Found this funny..
— Lakshmi Manchu (@LakshmiManchu) December 19, 2017
Amit shah asked for 150 seats out of 182 in Gujarat.
Gujju people gave him 99 after deducting 28% GST.
182 * 28%= 51, 150-51=99...
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more