చైనా మీడియా మళ్లీ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత్ కు చెందిన ఒక డ్రోన్ తమ గగనతలంలోకి వచ్చిందని చైనా ఆర్మీ అధికారులు దానిని కూల్చివేసినట్లు కథనంలో పేర్కొనింది. భారత దేశానికి చెందిన డ్రోన్ చైనా గగనతలంలోకి వెళ్లిందా..? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే ఇలా జరిగిందని ఏకంగా చైనా అధికార మీడియా కథనాన్ని వెలువరించడం కూడా సంచలనంగా మారింది. నిన్నమొన్నటి వరకు ఇరు దేశాల మధ్య డోక్లాం సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నగా.. అప్పట్లో అలాంటి వార్తా కథనాలనే ప్రచురించిన మీడియా.. మళ్లీ ఇన్నాళ్లు ఇలాంటి కథనాన్ని ప్రచురించడం చర్చనీయాంశంగా మారింది.
చైనా ప్రాదేశిక సౌర్వభౌమత్వాన్ని ఉల్లంఘించేలా భారత్ చర్య ఉందని అర్మీ అధికారులు అక్షేపించారని కథనంలో పేర్కోనింది. అయితే ఇలాంటి ఘటనలపై తాము తీవ్ర అసహనం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని కూడా చైనా ఆర్మీ డిప్యూటీ డైరెక్టర్ జాంగ్ షౌలీ మీడియాతో తెలిపారని పేర్కోంది. అయితే భారత్ కు చెందిన డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది..? ఎక్కడ పేల్చివేయబడింది..? ఎప్పుడు వచ్చింది..? అన్న వివరాలను మాత్రం మీడియా వెల్లడించలేదు. చైనా సరిహద్దు దళాలు డ్రోన్ను గుర్తించినట్లు పేర్కొన్నారు.
అయితే దీనిపై భారత అధికారుల నుంచి ఇంకా స్పందన రాలేదు. కాగా కొద్ది నెలల క్రితం భారత్-చైనా మధ్య డోక్లాం వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. భారత భద్రతకు భంగం కలిగేలా చైనా రోడ్డు నిర్మాణం చేపట్టిందని మన దేశం ఆరోపించింది. భారత సైన్యం దాన్ని అడ్డుకోవడంతో చైనా మండిపడింది. భారత సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పలు మార్లు హెచ్చరించింది. దాదాపు రెండున్నర నెలల ఉద్రిక్తత తర్వాత ఆగస్టులో డోక్లాం వివాదం సద్దుమణిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more