మెట్రో రైలు ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ తీపి కబురును అందించింది. ఈ అర్థిక సంవత్సరం చివరి వరకు తమ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు రాయితీ ప్రకటించింది. ఎంత అంటే ప్రయాణించిన ప్రతీ సారి ప్రయాణికులుకు పదిశాతం రాయితి అందుతోందని తెలిపింది. అయితే అందుకు ఒక కండీషన్ ను పెట్టింది. అందరు ప్రయాణికులకు ఈ రాయితీ వర్తించదని, కేవలం స్మార్ట్ కార్డ్ వినియోగదారులకు మాత్రమే పదిశాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మెట్రో ప్రాజెక్టుకు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో కృతజ్ఞతాపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
మెట్రో రాయితీతో పాటు స్మార్ట్ కార్డ్ రీచార్జిపై(మొదటిసారి) రూ.20 పేటీఎం క్యాష్బ్యాక్ ఇవ్వనున్నట్లు వివరించింది. మెట్రోలో ఇబ్బందుల్లేని ప్రయాణం కోసం స్మార్ట్కార్డ్లను ఉపయోగించాలని సూచించింది. కాగా, మొదటి రైలు ఉదయం 6 గంటలకు నాగోల్, మియాపూర్, అమీర్పేట్ నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రాత్రి పది గంటలకు చివరి రైలు నాగోల్ నుంచి అమీర్పేట్, మియాపూర్ నుంచి అమీర్పేట్కు ఉంటుంది. మియాపూర్ నుంచి అమీర్పేట్కు ప్రతి 8 నిమిషాలకు, నాగోల్ నుంచి అమీర్పేట్కు ప్రతి 16 నిమిషాలకు ఓ రైలు ఉంది. భవిష్యత్తులో ఈ సమయాన్ని మరింత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని మెట్రో వర్గాలు వెల్లడించాయి.
ఇక మెట్రో స్టేషన్లలో తాగునీటిని అందుబాటులో ఉంచుతున్నారు. డస్ట్బిన్లను మాత్రం భద్రతా కారణాల రీత్యా ఏర్పాటు చేయడంలేదు. స్టేషన్లలో అత్యవసర ప్రకటనలను మాత్రమే సిబ్బంది చేస్తారు. మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. నాగోల్, పరేడ్ గ్రౌండ్స్, రసూల్పురా, బాలానగర్, కూకట్పల్లి, మియాపూర్ స్టేషన్ల వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కాగా, స్టేషన్ లోపలికి వెళ్లాక రెస్ట్రూంను ఉపయోగించుకోవాల్సి వస్తే.. సిబ్బంది అనుమతితో పబ్లిక్ స్పేస్లో ఏర్పాటు చేసిన బాత్రూంలను ఉపయోగించుకోవచ్చని మెట్రో వర్గాలు తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more