ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న పాత నానుడిని బాగా వంట పట్టించుకున్న ఓ అధికారి తాను కూడా ఇలాంటి పనులే చేసినా దొరకబోనని అనుకున్నాడు. అంతే తాను ఉన్న.. ఉద్యోగం నిర్వహిస్తున్న శాఖకే వెన్నుపోటు పొడిచి.. కంచె చేను మేసిన తరహాలో అవినీతికి పాల్పడ్డాడు. అవినీతి పరులకు ఈ శాఖ పేరు చెబితేనే సింహస్వప్నం. కానీ అలాంటి శాఖలో ఓ అవినీతిపరుడు తన అవినీతిని పెంచుకునేందుకు వినియోగించుకున్నాడు.
అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తూనే.. తమ విభాగం (ఏసీబీ) అధికారులు జరిపే దాడులకు సంబంధించిన సమాచారాన్ని అవినీతి అధికారులకు ముందుగానే చేరవేసి వారి నుంచి తాయిలాలను అందుకున్నాడు. దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన అవినీతిపరులు తమ వద్దనున్న అక్రమ సంపద, అందుకు సంబంధించిన పత్రాలను వెనువెంటనే తమ బంధువుల ఇళ్లకో లేక స్నేహితుల ఇళ్లకో పంపించే అవకాశం కల్పించాడు. అవినీతి అధికారులు పక్కగా ప్లాన్ చేసిన అకస్మిక దాడులు జరిపినా.. అవినీతిపరులైన అధికారుల వద్ద ఎలాంటి అక్రమసోత్తు లభ్యం కాకపోవడంతో.. ఖంగుతిన్న అధికారులు షాక్ కు గురయ్యారు.
తమ దాడుల సమాచారం ముందుగానే అందుకోవడంతోనే అవినీతి అధికారులు అలెర్ట్ అవుతున్నారని గ్రహించారు. దీంతో తమ శాఖలోనే ఇందుకు సంబంధించిన అధికారులు వున్నారని గ్రహించిన అధికారులు.. ఓ ప్రణాళికా బద్దంగా ఇంటిదొంగను పట్టుకున్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంటిపై దాడి జరుపుతున్నట్లు సమాచారంతో అప్రమత్తం కావడంతో ఆ విభాగానికి చెందిన అధికారి నుంచి అతనికి కాల్ వెళ్లింది. దీంతో అధికారి డ్రామా ముగిసింది. అతనే ఏసీబీ రహస్య విభాగం మేనేజర్ శోభన్ బాబు. దీంతో ఏసీబీ డీజీ ఠాకూర్ సదరు అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు.
అవినీతి అధికారులతో శోభన్ బాబు కుమ్మక్కయి.. ముందుగానే ఏసీబీ దాడుల సమాచారాన్ని వారికి అందవేస్తున్నట్టు తాజాగా గుర్తించారు. 50మందికి పైగా అవినీతిపరులతో ఆయన సంప్రదింపులు జరిపినట్టు కాల్ డేటా ఆధారంగా ఏసీబీ ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో శోభన్ బాబుపై శాఖపరమైన విచారణకు ఠాకూర్ ఆదేశించారు. కాల్ డేటా ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేశారు. సమాచారం లీక్ చేయడంతో పాటు మరేదైనా అక్రమాలకు పాల్పడ్డడా..? అన్న కోణంలోనూ అధికారులు అతనిపై విచారణ జరుపుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more