వరంగల్ జిల్లాలో వివాహితపై దారుణం జరిగింది. అమెతో పరిచయం వున్న అటోడ్రైవర్ అమెను నమ్మించి నిర్జన, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అమె చేతులు కాళ్లు కట్టేసి అత్యంత కిరాతకంగా అమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామ శివారులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యాసిడ్ గాడికి తట్టుకోలేక వివాహిత పెడుతున్న అర్థనాధాలను అటుగా వెళ్లున్న కూలీలు విని స్థానిక సర్పంచ్ కు సమాచారం అందించారు.
సర్పంచ్ ఫిర్యాదుతో అటు అటు జఫర్గఢ్ పోలీసులతో పాటు ఇటు 108 అంబులెన్సు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నాయి. అప్పటికీ అమ్లా దాడికి తట్టుకోలేక..అర్థానాధాలు పెడుతున్న వివాహిత అపస్మారక స్థితిలోకి జారుకుంది. పోలీసులు అమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించారు. ఒంటి పై కాలిన గాయాలతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు.
వరంగల్ జిల్లాలోని కరీమాబాద్ శాకరాశికుంటకు చెందిన బోయిన మాధురి (21) తన మేనమామ అయిన చంటిని మూడేళ్ల కిత్రం వివాహం చేసుకుంది. వీరికి ఏడాదిన్నర కూతురు ఉంది. భర్తతో మనస్పర్థల కారణంగా గత కొన్నాళ్లుగా పుట్టింట్లోనే వుంటూ హంటర్ రోడ్డులోని ఒక పెట్రోలు బంకులో పని చేస్తోంది. అమెను రోజు పెట్రోల్ బంకుకు తీసుకెళ్లే అటో డ్రైవర్ తో పరియం ఏర్పడింది. ఇది గమనించిన తల్లి మాధురిని ఉద్యోగం మాన్పించింది. ఈ క్రమంలో పక్కాప్రణాళికతో మాధురికి మాయమాటలు చెప్పి తన ఆటోలో గర్మిళ్ల్లపల్లిలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. తన స్నేహితుడితో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more