తెలంగాణ టీడీపీ సమావేశం వాడీవేడిగా సాగినా.. అర్ధాంతరంగా ముగిసింది. సమావేశానికి హాజరైన ముఖ్యనేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో హాజరైన రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. రేవంత్ హాజరు కారు అనుకన్న పార్టీ నేతల అశలపై నీళ్లు చల్లారు. అంతేకాదు ఈ సమావేశంలో రేవంత్ రెడ్డిను ఒంటిరిని చేసి ప్రశ్నల వర్షం కురిపించినా.. అన్నింటికీ ఆయన ఒకే సమాధానం చెప్పడంతో.. సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చేసిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు మీడియాతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
ఈ సమావేశానికి హజరైన రేవంత్ రెడ్డికీ.. ఇతర తెలంగాణ టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు సమాచారం. కాగా సమావేశప్రారంభంలో టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని లీకులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటీ..? ఎందుకిలా చేస్తున్నారని ఉమామాధవ రెడ్డి రేవంత్ ను ప్రశ్నించారు. అనంతరం మోత్కుపల్లి నర్సింహులు కూడా రేవంత్ పై పలు ప్రశ్నలను సంధించారు. అయితే టీడీపీ నేతలు అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి అసలు సమాధానమే చెప్పలేదు.
ఎవరి అనుమతితో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారని రేవంత్ రెడ్డీని మోత్కుపల్లి, అరవింద్ ప్రశ్నించారు. చంద్రబాబు అనుమతి తీసుకున్నారా అని అడిగారు. అసలు కాంగ్రెస్ నేతలను కలిసే అవసరం ఏమిటీ, ఎందుకోచ్చిందని ఆయన ప్రశ్నించారు. దీనికి తోడు పోరుగు రాష్ట్రంలో వున్న మన టీడీపీ నేతలపై అరోపణలు ఎందుకు చేశారన్న కూడా ప్రశ్నించారు. సొంత పార్టీకి చెందిన నేతలపై విమర్శలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా, మీడియాలో వచ్చిన వార్తలకు తాను ఎలా బాధ్యుడిని అవుతానని రేవంత్ అన్నారు.
ఇక తెలంగాణ టీడీపీ నేతలు నుంచి ఊహించని విధంగా ప్రశ్నల వర్షం కురుస్తున్న నేపథ్యంలో రేవంత్ ఒక్క సమాధానం అందరినీ అగ్రహావేశాలకు గురిచేసింది. తాను తెలంగాణ టీడీపీ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. తనను ప్రశ్నించే అధికారం పార్టీ నేతలకు లేదని, ఈ క్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వద్దే అన్ని విషయాలను తేల్చుకుంటానని అన్నారు. రేవంత్ రెడ్డి సమాధానంతో సీనియర్ నేతలు మోత్కుపల్లి, అరవింద్ వెళ్లిపోయారు. దీంతో, సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.
తాము ఏది అడిగినా రేవంత్ రెడ్డి సరైన సమావేశం ఇవ్వలేదని అన్నారు. రాహుల్ ను కలిశారా? ఒకవేళ కలిస్తే ఎందుకు కలిశారో చెప్పాలని రేవంత్ ను కోరామని...చంద్రబాబుకే వివరణ ఇస్తానని రేవంత్ చెప్పారని టీటీడీపీ నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అరవిందకుమార్ గౌడ్ తెలిపారు. రేవంత్ నుంచి సమాధానాలు సరిగ్గా రాకపోవడంతో తాను, మోత్కుపల్లి సమావేశం నుంచి వాకౌట్ చేశామని చెప్పారు. వివరణ ఇవ్వాలంటూ పార్టీ నేతలంతా కోరినప్పటికీ... రేవంత్ మాత్రం సమాధానాలను దాటవేశారని అరవింద్ అన్నారు. టీడీపీ వల్లే రేవంత్ ఈ స్థాయికి వచ్చారని చెప్పారు. రేవంత్ రెడ్డి టీడీపీని వీడినా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more