భారత ప్రజలు కనివీని ఎరుగని రూ. 2000 కొత్త నోటును నోట్ల రద్దు నేపథ్యంలో చెలామణిలోకి తీసుకువచ్చిన కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని దాదాపుగా పది నెలలు కావస్తున్న క్రమంలో కూడా ఇంకా నూతనమైన నిర్ణయాలను తీసుకుంటూ.. ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇటీవల వినాయక చవితి సందర్భంగా గత నెల 25న కొత్తగా రూ.200 నోటును చెలామణిలోకి తీసుకువచ్చిన కేంద్రం.. చిల్లర సమస్యను తొలగించేందుకే ఈ నోటును విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
అయితే ఇప్పటికీ ఈ నోటును చూడని వాళ్ల సంఖ్య అసంఖ్యాకమే. ఈ తరుణంలో త్వరలో కొత్తగా వంద రూపాయిల కాయిన్లను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అన్నాడీఎంకే వ్యవస్థాపకులు, తమిళ నటుడు డాక్టర్ ఎంజీ రామచంద్రన్ శతజయంతోత్సవాలను పురస్కరించుకుని ఆయన కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థిక శాఖ పేర్కోంది. రూ. 100 నాణేలాను రెండు ఫార్మెట్లలో ముద్రించనున్నట్లు కేంద్ర అర్థిక శాఖ స్పష్టం చేసింది.
దీంతో పాటు కొత్త రూ. 10, రూ. 5 నాణెలను ముద్రిస్తున్నట్లు కూడా పేర్కొంది. రూ. 100 కాయిన్ వ్యాసం 44 మిల్లీమీటర్లు ఉంటుందని తెలిపింది. రూ. 100 కాయిన్ పై నాలుగు సింహాల అశోకుని స్థూపం ఉంటుందని వివరించింది. కాగా వెనుక పక్కన ఒక ఫార్మెట్ లో ఎంఎస్ సుబ్బలక్ష్మీ బోమ్మను ముద్రించనున్నట్లు అర్థిక శాఖ తెలిపింది. ఇక మరో ఫార్మెట్ లో వంద నాణేలా వెనుక భాగంలో ఎంజీ రామచంద్రన్ బొమ్మ ఉంటుందని తెలిపింది. ఇక వంద రూపాయల నాణెం బరువు 35 గ్రాములు ఉంటుందని, దీన్ని తయారు చేయడానికి వెండి, రాగి, నికెల్, జింక్ల మిశ్రమాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.
23 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో ఉండే రూ.5 నాణేల బరువు 6 గ్రాములు ఉంటుందని చెప్పింది. దీంతో పాటు కొత్తగా రూ. 10 నాణేలను కూడా ముద్రిస్తున్నట్లు అర్థిక శాఖ ప్రకటనలో పేర్కొనింది. ఐదు రూపాయల నాణేం వెనుక పక్కన ఎంజీ రామచంద్రన్ బొమ్మను ముద్రించగా, రూ. 10 నాణెం వెనుక ఎంఎస్ సుబ్బలక్ష్మీ బొమ్మను ముద్రించామని పేర్కొంది. ఎంఎస్ సుబ్బలక్ష్మీ, రామచంద్రన్ ల శతజయంతిని పురస్కరించుకుని నాణేలతో పాటు పోస్టల్ స్టాంపులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more