దేశ ప్రజలు కనీవిని ఎరుగని కానుకను కేంద్ర ప్రభుత్వం వినాయకచవితి సందర్బంగా అందించనుంది. అదే రూ. 200 నోటు. దేశ చరిత్రలోనే తొలిసారి 200 డినామినేషన్ గల నోటును వినాయక చవితిని పురస్కరించుకుని ఈ నెల చివర్లో దేశప్రజలకు అందెలా భారతీయ రిజర్వు బ్యాంకు మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ నెల చివర్లో రూ.200 నోటులను ప్రజలకు అందుబాటులోకి.. చెలామణిలోకి తీసుకునరావాలని ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే అనివార్య కారణాలు ఎదురైన పక్షంలో ఈ నోటును సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం కానుకగా అందించాలని కేంద్రం భావిస్తుంది. అంటే వచ్చే నెలలో మొదటి వారంలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానుంది.
దీంతో పాటు కొత్తగా ముద్రించిన రూ.50 నోటును కూడా చెలమణిలోకి తీసుకురావాలని రిజర్వు బ్యాంకు తలపించినట్లు సమాచారం. ముఖ్యంగా బ్లాక్ మార్కెటింగ్ కు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్న అనంతరం రూ.50 కోట్ల నోట్లను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నోట్ల చలామణిలో ఎలాంటి అక్రమ ట్రేడింగ్ జరుగకుండా ఉండేందుకు ఆర్బీఐ అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటి వరకు రూ.100, రూ.500 డినామినేషన్ నోట్లకు మధ్యలో ఎలాంటి ఇతర డినామినేషన్ నోట్లు లేవు. అయితే కొత్తగా వస్తున్న రూ.200 నోటు ఈ వెలతిని భర్తీ చేస్తుందని మార్కెట్ వర్గాలు యోచిస్తున్నాయి.
ఆర్బీఐ ప్రస్తుతం తీసుకురాబోతున్న రూ.200 నోట్లు మరింత ప్రాధాన్యత సంతరించుకోబోతున్నాయి. ఈ కారణంతోనే పకడ్బందీగా ఈ నోట్లను విడుదల చేయాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆర్బీఐ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. పెద్ద మొత్తంలో ఈ నోట్లను విడుదల చేస్తుండటంతో, సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న కార్యాచరణ సమస్యలను ఇవి నిరోధిస్తాయని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అర్థికవిభాగం గ్రూప్ చీఫ్ సౌమ్య కాంతి ఘోష్ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more