దేశవ్యాప్తంగా మహిళ రక్షణ పోలీసులకు కత్తి మీద సాములా మారింది. ఏక్కడ ఏ నేరం జరుగుతుందో. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సివస్తుందోనని వారు అనునిత్యం అందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా అర్థరాత్రిళ్లు విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకునే యువతులు, మహిళల విషయంలో ఈ మధ్య బీజేపి అధ్యక్షుడి కుమారుడు ఒక చోట, దేశ రాజధాని ఢిల్లీలో మరో మహిళ ఇలాంటి పోకిరీలు వెంటపడుతుంటే వారి నుంచి తప్పించుకుని పోలీసులకు పిర్యాదు చేసిన ఘటనలు వెలుగు చూడటంతో.. అసలు మహిళలకు భద్రత కరువైందన్న విమర్శలు కూడా వనబడుతున్నాయి.
ఈ నేపథ్యంలో మహిళల విషయమై చెందుతున్న అందోళనను అధిగమించి.. రాచకొండ పోలీసు ఓ వినూత్న నిర్ణయంతో ముందుకోచ్చారు. అదే ఐటీ కేంద్రంలో పనిచేసే మహిళలకు ప్రత్యేక షటిల్ సర్వీసులను తీసుకోచ్చారు. కేవలం మహిళలను మాత్రమే అనుమతించే ఈ వాహనాల్లోకి వారు క్షేమంగా వార్వారి గమ్యస్తానాలకు చేరుకునే వెసలుబాటు కల్పించారు. ఇవాళ అధికారింకంగా ప్రారంభమైన ఈ బస్సు సర్వీసులు.. ఐటీ కారిడార్ లో మహిళా ఉద్యోగినుల సురక్షిత ప్రయాణం కోసం వినియోగంలోకి వచ్చాయి.
సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహాకారంతో ఈ ‘షీ షటిల్’ సర్వీసులను ఎల్బీనగర్ నుంచి పోచారం ఐటీ కారిడార్ వరకు రాచకొండ పోలీసులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐటీ ఉద్యోగినులకు వారి ప్రయాణంలో భద్రత మరింత పెరగనుందని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ ఐటీ కారిడార్లో దాదాపు 20 వేల మంది మహిళ ఉద్యోగులు ఉన్నారన్న అయన.. వారి భద్రత, సురక్షణ కోసం ఈ సర్వీసులు దోహదపడనున్నాయని అన్నారు. ఈ బస్సు సర్వీసుల ప్రారంభోత్సవానికి హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యలు హాజరయ్యారు. అవసరమైన వారందరికీ ‘షీ షటిల్’ సర్వీసు బస్సు వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. సైబరాబాద్లో ఈ షీ షటిల్ బస్సు సర్వీసులను ప్రతి రోజు దాదాపు 1200 మంది మహిళ ఐటీ ఉద్యోగినులు ప్రయాణించవచ్చనని అంచనా వేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more