టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. నంద్యాల బైపోల్ లో తనకే మద్ధుతు ఇవ్వాలంటూ సోదరుడు హోహన్ రెడ్డి కోరటం, ఆ వెంటనే కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు చక్రపాణి సిద్ధపడిపోతుండటంతో దాదాపు చేరిక ఖాయమైందనే చెప్పుకున్నారు. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
గత కొన్ని రోజులుగా పార్టీ కార్యాకలాపాలకు చక్రపాణి దూరంగా ఉంటూ వస్తున్నారు. తన అన్న మోహన్ రెడ్డిని వైసీపీలో చేరకుండా ఆపడంలో విఫలమయ్యారని పలువురు తెలుగుదేశం నేతలు శిల్పా చక్రపాణిరెడ్డిపై బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నంద్యాల పర్యటనలోనూ ఈ ఎమ్మెల్సీ దూరంగానే ఉంటూ వస్తున్నారు. దీంతో 3వ జగన్ నంద్యాల టూర్ లో కండువా పుచ్చుకునేందుకు చక్రపాణి రెడీ అయిపోయాడనే సంకేతాలు అందాయి.
కానీ, ఆ పార్టీ నాయకుల నుంచి తనకు ఆహ్వానం అందిన మాట నిజమేనని, ఇంకా జగన్ నుంచి మాత్రం ఎలాంటి పిలుపు రాలేదని చక్రపాణి స్పష్టం చేశాడు. తెలుగుదేశం హైకమాండ్, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తూ, తనవంటి వారిని పట్టించుకోవడం లేదని విమర్శించిన ఆయన, పలు అధికారిక కార్యక్రమాలకు కూడా తనను ఆహ్వానించడం లేదని వాపోయారు. సుదీర్ఘకాలంగా తన వెంట నడుస్తున్న కార్యకర్తల మనోభావాలను తెలుసుకోనున్నానని, వారితో సమావేశం తరువాత తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.
ఇంకోపక్క రాజకీయ భవితవ్యంపై కూడా మంతనాలు చేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో శ్రీశైలం అసెంబ్లీ సీటు గ్యారెంటీగా ఇస్తామని చెబితేనే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని, లేకుంటే రాజీనామా చేసి వైకాపాలోకి వెళ్లడం మినహా మరో మార్గం కనిపించడం లేదని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, తనను బుజ్జగించేందుకు వచ్చిన ఎంపీ సీఎం రమేష్, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more