తెలుగు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్. ఓవైపు తెలంగాణలో డ్రగ్స్ మూలాలు మొగ్గ దశలోనే ఉన్నాయంటూ స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించగా, భారీ మొత్తంలో గుట్టును ఇంటలిజెన్స్ బ్యూరో రట్టు చేసింది. ఈ క్రమంలో నలుగురు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
మెదక్, నల్గొండ, జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరిపిన డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఏకంగా 600 కేజీల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.5 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి పలు షాకింగ్ విషయాలే వెల్లడైనట్లు సమాచారం. అల్పజోరమ్ అని పిలిచే ఈ డ్రగ్ ను కల్లుతో కలిపి అలవాటు చేస్తుంటారు. కాగా, తెలంగాణలో ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి. వాటిని ల్యాబ్లలో తయారుచేసినట్టు అధికారులు గుర్తించారు. ల్యాబ్లు ఏవైనా ప్రముఖ సంస్థలకు చెందినవా? లేక ప్రత్యేకంగా ఏర్పాటు చేశారా? అన్నది తేలాల్సి ఉంది.
ఓవైపు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఓ వైపు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారిస్తుంటే, మరోవైపు కేంద్ర ఇంటెలిజిన్స్ సంస్థ శుక్రవారం చడీచప్పుడు కాకుండా మరో భారీ డ్రగ్ రాకెట్ ముఠాను అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది. డ్రగ్స్, గుడుంబా వ్యాపారాలపై సమాచారమిస్తే లక్ష రూపాయల నజరానాను తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన కాసేపటికే ఈ అరెస్ట్ వార్త మీడియాలో రావటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more