రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యుడు పట్టిసీమ ప్రాజెక్టుపై మళ్లీ పదను పెంచాడు. పట్టిసీమతో స్థానిక రైతాంగానికి లబ్ది చేకూరిందని.. ప్రకాశం బ్యారేజీపై టీడీపీ నేత గొరంట్ల బుచ్చయ్య చౌదరితో బహిరంగ చర్చకు సిద్దమైన సందర్భంగా అంగీకరించిన ఆయన మరింతగా ఆ ప్రాజెక్టుపై అథ్యయనం చేసి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తనదైన మాటల పదనును పెంచాడు. చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నట్ల వట్టిసీమ అసలు నీళ్లు తోడే ప్రాజెక్టే కాదని స్సష్టం చేశారు. వట్టిసీమ పేరుతో ప్రభుత్వం డబ్బులు తోడేస్తుందని ఉండవల్లి అరోపించారు.
ఇవాళ మీడియాతో మాట్లాడిన ఉండవల్లి తాను గత రెండున్నరేళ్ల నుంచి అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని, అయితే ఇప్పటి వరకు ఒక్కదానిపైన కూడా సమాధానం రాలేదని, సంబంధిత మంత్రులు, అధికారుల నుంచే కాదు కనీసం ఆయా కార్యాలయాల అటెండర్ల నుంచి కూడా సమాధానం రాలేదని వాపోయారు. ప్రభుత్వ పనితీరును అంచనా వేసేందుకు కాగ్ నివేదికే సరైన ఆయుధమన్నారు. కాగ్ నివేదిక ఆధారంగా ప్రభుత్వ పనితీరును పీఏసీ ప్రశ్నిస్తుందని వెల్లడించారు. వైఎస్ హాయంలో చేపట్టినన్ని సాగునీటి ప్రాజెక్టులు ఏ ముఖ్యమంత్రి చేపట్టలేదని అన్నారు.
‘రాజా ఆఫ్ కరప్షన్’ ఎవరన్న అంశంపై కూడా తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వ పెద్దల అవినీతిని నిరూపిస్తానని ఇంతకుముందు ఉండవల్లి అరుణ్ కుమార్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీనికి టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో బహిరంగ చర్చకు సవాల్ ను కూడా స్వీకరించిన ఉండవల్లిని పోలీసు అనుమతి లేదన్న కారణంగా అరెస్టు చేసి వెనక్కు పంపించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more