తెలంగాణలో ఎక్కడ ఏ మూల నేరాలు జరిగినా వాటి భరతం పడతామని ప్రకటించిన పోలీసులు.. నిజంగా అన్నంతపని చేస్తున్నారు. ఇప్పటికే ఓ వైపు పెను కలకలం రేపుతున్న డ్రగ్స్ రాకెట్ గుట్టును చేధించి.. అనుమానితుల నుంచి వారి వాంగ్మూలాలను తీసుకుంటుండగా, మరో వైపు రాష్ట్రంలో గుట్టుగా సాగుతున్న వ్యభిచార గృహాలపై దాడులు చేసి నిర్వాహకులను అరెస్టు చేస్తున్నారు. తాజాగా పాఫ్ కాలనీలలో ఉన్నత కుటుంబాలకు చెందిన వ్యక్తుల మధ్య అద్దెకు ఇళ్లను తీసుకుని అత్యంత గోప్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నగరం సెంట్రల్ జోన్ టాస్క్ పోర్స్, మలక్ పేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించగా వ్యభిచార గుట్టు రట్టైంది. వ్యభిచార కూపంలో మగ్గిపోతున్న ముగ్గురు మహిళలకు పోలీసులు విముక్తి కల్పించారు. ఈ సందర్భంగా నలుగురు నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి రూ.33 వేల 610 నగదుతో పాటు 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గత కొద్ది నెలల క్రితం మలక్ పేటలోని సలీమ్ నగర్ తో పాటు చైతన్యపురిలోని రెడ్డి కాలనీలో ఇల్లను అద్దెకు తీసుకున్న ముఠా అక్కడ స్థానికులతో కలసి ఉన్నత కుటుంబాలకు చెందిన వ్యక్తులుగా నటిస్తూ.. గుట్టుగా వ్యభిచారం చేసింది.
అయితే తరచూ వారింటికి గుర్తుతెలియని వ్యక్తులు వస్తుండటంతో.. అనుమానం వచ్చిన స్థానిక కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించగా, ముగ్గురు మహిళలతో పాటు నలుగురు పట్టుబడ్డారు. మహిళలను సంరక్షణ కేంద్రానికి తరలించిన పోలీసులు చైతన్యపురికి చెందిన టియు శ్రీనివాస్, హయత్ నగర్ కు చెందని సాయ్ కుమార్ తో పాటు మలక్ పేటకు చెందిన నాగరాజు, శ్రీరాములు అనే నిర్వాహకులను అదుపులోకి తసుకున్నారు. కాగా కీలక నిందితుడు భాస్కర్ మాత్రం పరారీలో వున్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more