స్మార్ట్ ఫోన్ల అమ్మకాలలో ప్రస్తుతం టాప్ లిస్ట్ లో ఉన్న 'ఒప్పొ'కి గడ్డుకాలం వచ్చిపడింది. చైనా కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ కి చెందిన ఓ ఉన్నత ఉద్యోగి భారతీయులను అవమానించటంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగగా, సెల్ ఫోన్ల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన యాజమాన్యం పరిస్థితిని చక్కదిద్దడానికి నానా ఆగచాట్లు పడుతోంది.
ఒప్పొ పంజాబ్ కార్యాలయంలో పని చేస్తున్న చైనా ఉద్యోగుల టీమ్ లోని అధికారి ఒకరు 'భారతీయులు అడుక్కుతినేవారు' అని వ్యాఖ్యానించినట్టు ఓ న్యూస్ వైరల్ అయింది. సర్వీస్ టీమ్ లో మేనేజర్ గా పని చేస్తున్న అరుణ్ శర్మ అనే ఉద్యోగిని టార్గెట్ చేస్తూ.. ‘‘ఇండియన్స్ కు కల్చర్ లేదని, భారతీయులు డబ్బు కోసమే పని చేస్తారని, డబ్బుల కోసం అడుక్కుంటారని’’ సదరు చైనా అధికారి వ్యాఖ్యానించినట్టు విషయం బయటకు పొక్కింది. ఈ విషయాన్ని అరుణ్ శర్మ, ఓ లేఖ ద్వారా మీడియాకు కూడా చేరవేశాడు.
ఈ నేపథ్యంలో ఫేస్ బుక్, ట్వి్ట్టర్ లో ఒప్పో ఫోన్లను కొనుగోలు చేయవద్దన్న ప్రచారం జోరుగా సాగగా, అమ్మకాలు తగ్గాయి. దీంతో రంగంలోకి దిగిన యాజమాన్యం చైనా టీంతో రాజీనామా చేయించినట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, తప్పు చేసిన అధికారిపై చర్యలుంటాయని ఒప్పొ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో నోయిడా కార్యాయలం సిబ్బంది జాతీయ పతాకాన్ని చించి అవమానించటం పెను దుమారమే రేపగా, ఒప్పో ఆ సిబ్బందిపై వేటు వేసింది కూడా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more