కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి ఊహించని ఝలక్ తగిలింది. ఆయనకు సంబంధించిన స్వర్ణ భారత్ ట్రస్ట్ కు కేంద్ర హోం శాఖ నోటీసులు జారీ చేసింది. వెంకయ్య తోపాటు మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి కి కూడా ఇలాంటి షాకే ఇచ్చింది కూడా. వాటిని మూసేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
ఎన్జీవోలుగా పేర్లు నమోదు చేసుకుని విదేశాల నుంచి భారీగా నిధులు పొందాయన్న ఆరోపణలపై దేశం మొత్తం మీద 5,922 సంస్థలకు కేంద్ర హోం శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అనుమతులు ఉన్నప్పటికీ, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద రిజిస్టరు కాకుండా, అవి నిధులు పొందుతున్నాయి. ఈ క్రమంలోనే వాటికి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. వెంకయ్యనాయుడు కుటుంబం(కూతురు దీపా వెంకట్) ఆధ్వర్యంలో నడుస్తున్న స్వర్ణ భారత్ ట్రస్టు, సుజనా చౌదరి నిర్వహిస్తున్న సుజనా ఛారిటబుల్ ట్రస్టుతో పాటు శ్రీసత్యసాయి మెడికల్ ట్రస్ట్ లాంటి ప్రముఖ సంస్థలు ఎన్నో ఉన్నాయి.
ప్రతి సంవత్సరమూ ఆదాయ రిటర్నులు సమర్పించాల్సిన ఈ సంస్థలు 2010 నుంచి 2015 మధ్య రిటర్నులు దాఖలు చేయలేదని తెలుస్తోంది. ఇక నోటీసులు అందుకున్న మిగతా ప్రముఖ సంస్థల్లో ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం, శ్రీ రామకృష్ణ సేవాశ్రమం, ఇందిరా గాంధీ కళాక్షేత్రం, నెహ్రూ స్మారక మ్యూజియం - గ్రంథాలయం, ఇగ్నో వంటి స్వచ్ఛంద సంస్థలున్నాయి. జూలై 23లోగా నోటీసులకు సమాధానం ఇవ్వకుంటే, రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. గతంలో భూకబ్జాలకు పాల్పడి మరీ స్వర్ణ భారత్ ట్రస్టు నిర్మాణాలు చేపడుతున్నారని వామపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more