భూటాన్ తో చైనా వివాదం, సిక్కిం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ మరిన్ని బలగాలను మోహరిస్తోంది. యుద్ధ పద్ధతిలో కాకుండా బలగాలను తరలిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ భారత్-చైనా సైనికులు ఎదురెదురుగా (స్టాండ్ ఆఫ్) నిల్చుని ఎవరూ ఎటూ కదలకుండా అప్రమత్తంగా ఉన్నారు. 1962 తర్వాత ఇదే అత్యంత సుదీర్ఘ స్టాండ్ ఆఫ్. 2013లో లడఖ్ డివిజన్లోని డౌలత్ బేగ్ ఓల్డీ వద్ద 21 రోజులపాటు స్టాండాఫ్ కొనసాగింది. అప్పట్లో చైనా దళాలు భారత్ భూభాగంలోకి 30 కిలోమీటర్ల ముందుకు చొచ్చుకొచ్చాయి. భారత్ బలగాలు రంగంలోకి దిగడంతో చైనా ఆర్మీ వెనక్కి తగ్గింది.
ప్రస్తుతం సిక్కిం రీజియన్లోని భారత్, చైనా, భూటాన్ సరిహద్దులో ఉన్న డోక్లా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ పెద్ద ఎత్తున బలగాలను తరలిస్తుండడం ప్రాధాన్యం
సంతరించుకుంది. 1962 యద్ధం తర్వాత భారత్ ఈ స్థాయిలో బలగాలను తరలించడం ఇదే తొలిసారి. అయితే గన్ నాజిల్ను కిందికి ఉంచడం ద్వారా తాము యుద్ధానికి రావడం లేదన్న
సంకేతాలను భారత్ ఆర్మీ పంపింది. అలాగే డోకా లా ప్రాంతంపై ఆధిపత్యం ద్వారా భారత-భూటాన్ సరిహద్దులను పరిశీలించడానికి చైనా ప్రయత్నిస్తోంది.
మరోవైపు.. సిక్కిం ప్రాంతంలో భారతదళాలే హద్దు దాటినట్లు చూపించడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. తమ భూభాగంపై పూర్తి అధికారాలు తమవేనని, భారతదళాలే చొచ్చుకొచ్చాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధిలు కాంగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. దానికితోడు తాజాగా డోకాలా ప్రాంతం తమ భూభాగంలోనిదే అని చూపించుకోడానికి కొత్త మ్యాప్లను విడుదల చేసింది. 2012లో ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు బంకర్లను తొలగించాలని జూన్1న చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత్ను కోరింది. అందుకు భారత్ నిరాకరించింది. దీంతో ఆ ప్రాంతం తమదేనని, భారత్కు కానీ, భూటాన్కు కానీ దానిపై హక్కులు లేవంటూ జూన్ 6న బుల్డోజర్లతో భారత్ బంకర్లను ధ్వంసం చేసింది.
దీంతో చైనా ఆగడాలను అడ్డుకునేందుకు ఇండియన్ ఆర్మీ రంగ ప్రవేశం చేసింది. సైనికులను మోహరించింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు నెల రోజులుగా అక్కడ స్టాండాఫ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్ పెద్ద ఎత్తున బలగాలను తరలించడం చర్చనీయాంశమైంది. ఓవైపు చైనా హెచ్చరికలు ఇస్తున్నప్పటికీ ఇది యుద్ధానికి దారితీసే అంశం ఎంత మాత్రం కాదని ఓ సీనియర్ ఆర్మీ అధికారి వ్యాఖ్యానించారు.
చైనా మళ్లీ తుస్సు...
డ్రాగన్ కంట్రీ చైనా ఆశలు ఆవిరయ్యాయి. ఆ దేశం చేపట్టిన అత్యంత భారీ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ‘లాంగ్ మార్చ్-5 వై2’ పేరుతో ఆదివారం చేపట్టిన ప్రయోగం చైనాకు తీవ్ర నిరాశ
మిగిల్చింది. చైనా స్పేస్ ప్రోగ్రాంలో ఇది భారీ ఎదురుదెబ్బని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది వెన్చాంగ్లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన లాంగ్ మార్చ్-5 ప్రయోగం
విజయవంతం కాగా తాజా ప్రయోగం విఫలం కావడం చైనా శాస్త్రవేత్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇప్పుడు కూడా అదే వేదిక నుంచి లాంగ్ మార్చ్-5వై2ను ప్రయోగించినా భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టడంలో అది విఫలమైంది. లాంగ్ మార్చ్-5వై2 రాకెట్ బరువు 879 టన్నులు. 25 టన్నుల బరువున్న ఉప గ్రహాన్ని కక్ష్యలో పెట్టే సామర్థ్యం దీని సొంతం. అయితే తాజా ప్రయోగంలో మాత్రం అది మోసుకెళ్లిన 7.5 టన్నుల బరువైన షిజియాన్-18 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more