విభజన తర్వాత విపరీతమైన బకాయిలు పెరిగిపోవటంతో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన కరెంట్ ను నిలిపేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో రెండేళ్ల క్రితమే హస్తిన వెళ్లి జోక్యం చేసుకోవాలని హోం మంత్రిత్వ శాఖను కోరినప్పటికీ ఫలితం లేకపోవటంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మంగళవారం టీఎస్ ట్రాన్స్ కో అధికారులకు ఓ లేఖ కూడా అందింది.
తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మే 25నే ఆఖరిసారిగా నోటీసు పంపింది. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరాను కొనసాగిస్తామని ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టం చేసింది. తెలంగాణ నుంచి సుమారు 5వేల కోట్ల బకాయి రావాల్సి వుందని గుర్తు చేసిన ఏపీ ప్రభుత్వం వాటిని చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించింది. బకాయిలు చెల్లించేంత వరకూ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సి వుంది.
ఏడాదికి రూ.1,128 కోట్ల చొప్పున ఇప్పటిదాకా రూ, 4,449 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. అందులో 1390 కోట్లు ఏపీనే తెలంగాణకు చెల్లించాల్సి ఉండటంతో దానిని మాఫీ చేసి మిగతా 3138 కోట్లను చెల్లించాలని కోరింది. భారీ మొత్తంలో బిల్లులు పేరుకు పోవడంతో రోజువారీ ఆర్థిక కార్యకలాపాలను సైతం నిర్వహించడం కష్టంగా మారుతోందని జెన్కో చెబుతోంది. దక్షిణాది రాష్ట్రాల లోడ్ డిస్పాచ్ సెంటర్ సహా కేంద్రం కూడా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతోనే కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
చంద్రబాబుపై పెద్దపల్లిలో కంప్లైంట్...
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని బ్లాక్ డే గా అభివర్ణించిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు అందింది. టీఎస్ ముస్లిం పొలిటికల్ జేఏసీ, కేటీఆర్ యువసేన ఆధ్వర్యంలోని బృందం పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మను కలిశారు. అమరవీరులను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొనగా, న్యాయనిపుణులతో చర్చించి కేసు నమోదు చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more